వైసీపీ హయాంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చుకుని అక్కడి నుంచే అప్పటిసీఎం జగన్పాలన చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయన కార్యాలయంలో ఫర్నిచర్.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ సర్కారు కుప్పకూలడంతో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా రేగింది.
గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలానే ఫర్నిచర్ తన ఇంట్లో ఉంచుకుంటే.. ఆయనపై దొంగ అని ము ద్ర వేశారని, ఇప్పుడు జగన్ కూడా అలాంటి పనే చేశారు కాబట్టి.. ఆయనపైనా దొంగతనం కేసు పెట్టాలం టూ.. కొందరు టీడీపీ నాయకులు.. సహా కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది. లెక్కకట్టండి సొమ్ములు చెల్లిస్తాం అంటూ.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చంద్రబాబు సర్కారుకు లేఖరాశారు.
అయితే..దీనిపై సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా జగన్ కార్యాలయానికి లేఖ రాసింది. డబ్బులు వద్దులే.. సామాన్లు తిరిగి ఇచ్చేయండి అని పేర్కొంది. దీంతో జగన్ కార్యాలయం ఇప్పుడు ఫర్నిచర్ను ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఫర్నిచర్కొంత డ్యామేజీ అయినట్టు తెలుస్తోంది. దీంతో డ్యామేజీ అయిన ఫర్నిచర్ వరకు లెక్క కట్టి సొమ్ము చెల్లిస్తారా? లేక.. ఏం చేస్తారనేది చూడాలి.ఏదేమైనా.. ఫర్నిచర్వివాదానికి చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
This post was last modified on June 19, 2024 2:25 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…