Political News

డ‌బ్బులొద్దులే.. సామాన్లు ఇచ్చేయండి జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో త‌న ఇంటినే కార్యాల‌యంగా మార్చుకుని అక్క‌డి నుంచే అప్పటిసీఎం జ‌గ‌న్‌పాల‌న చేసిన విష‌యం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయ‌న కార్యాల‌యంలో ఫ‌ర్నిచ‌ర్‌.. ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూల‌డంతో ప్ర‌భుత్వ ధ‌నంతో కొనుగోలు చేసిన ఫ‌ర్నిచ‌ర్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజ‌కీయ దుమారం కూడా రేగింది.

గ‌తంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఇలానే ఫ‌ర్నిచ‌ర్ త‌న ఇంట్లో ఉంచుకుంటే.. ఆయ‌న‌పై దొంగ అని ము ద్ర వేశార‌ని, ఇప్పుడు జ‌గ‌న్ కూడా అలాంటి ప‌నే చేశారు కాబట్టి.. ఆయ‌న‌పైనా దొంగ‌త‌నం కేసు పెట్టాలం టూ.. కొంద‌రు టీడీపీ నాయ‌కులు.. స‌హా కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది. లెక్క‌క‌ట్టండి సొమ్ములు చెల్లిస్తాం అంటూ.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చంద్ర‌బాబు స‌ర్కారుకు లేఖ‌రాశారు.

అయితే..దీనిపై సుదీర్ఘ మంత‌నాలు చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాజాగా జ‌గ‌న్ కార్యాల‌యానికి లేఖ రాసింది. డ‌బ్బులు వ‌ద్దులే.. సామాన్లు తిరిగి ఇచ్చేయండి అని పేర్కొంది. దీంతో జ‌గ‌న్ కార్యాల‌యం ఇప్పుడు ఫ‌ర్నిచ‌ర్‌ను ప్ర‌భుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఫ‌ర్నిచ‌ర్‌కొంత డ్యామేజీ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో డ్యామేజీ అయిన ఫ‌ర్నిచ‌ర్ వ‌ర‌కు లెక్క క‌ట్టి సొమ్ము చెల్లిస్తారా? లేక‌.. ఏం చేస్తార‌నేది చూడాలి.ఏదేమైనా.. ఫ‌ర్నిచ‌ర్‌వివాదానికి చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో చెక్ పెట్టారు.

This post was last modified on June 19, 2024 2:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

2 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago