వైసీపీ హయాంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చుకుని అక్కడి నుంచే అప్పటిసీఎం జగన్పాలన చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయన కార్యాలయంలో ఫర్నిచర్.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ సర్కారు కుప్పకూలడంతో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా రేగింది.
గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలానే ఫర్నిచర్ తన ఇంట్లో ఉంచుకుంటే.. ఆయనపై దొంగ అని ము ద్ర వేశారని, ఇప్పుడు జగన్ కూడా అలాంటి పనే చేశారు కాబట్టి.. ఆయనపైనా దొంగతనం కేసు పెట్టాలం టూ.. కొందరు టీడీపీ నాయకులు.. సహా కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది. లెక్కకట్టండి సొమ్ములు చెల్లిస్తాం అంటూ.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చంద్రబాబు సర్కారుకు లేఖరాశారు.
అయితే..దీనిపై సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా జగన్ కార్యాలయానికి లేఖ రాసింది. డబ్బులు వద్దులే.. సామాన్లు తిరిగి ఇచ్చేయండి అని పేర్కొంది. దీంతో జగన్ కార్యాలయం ఇప్పుడు ఫర్నిచర్ను ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఫర్నిచర్కొంత డ్యామేజీ అయినట్టు తెలుస్తోంది. దీంతో డ్యామేజీ అయిన ఫర్నిచర్ వరకు లెక్క కట్టి సొమ్ము చెల్లిస్తారా? లేక.. ఏం చేస్తారనేది చూడాలి.ఏదేమైనా.. ఫర్నిచర్వివాదానికి చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
This post was last modified on June 19, 2024 2:25 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…