వైసీపీ హయాంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చుకుని అక్కడి నుంచే అప్పటిసీఎం జగన్పాలన చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయన కార్యాలయంలో ఫర్నిచర్.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ సర్కారు కుప్పకూలడంతో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా రేగింది.
గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలానే ఫర్నిచర్ తన ఇంట్లో ఉంచుకుంటే.. ఆయనపై దొంగ అని ము ద్ర వేశారని, ఇప్పుడు జగన్ కూడా అలాంటి పనే చేశారు కాబట్టి.. ఆయనపైనా దొంగతనం కేసు పెట్టాలం టూ.. కొందరు టీడీపీ నాయకులు.. సహా కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది. లెక్కకట్టండి సొమ్ములు చెల్లిస్తాం అంటూ.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చంద్రబాబు సర్కారుకు లేఖరాశారు.
అయితే..దీనిపై సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా జగన్ కార్యాలయానికి లేఖ రాసింది. డబ్బులు వద్దులే.. సామాన్లు తిరిగి ఇచ్చేయండి అని పేర్కొంది. దీంతో జగన్ కార్యాలయం ఇప్పుడు ఫర్నిచర్ను ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఫర్నిచర్కొంత డ్యామేజీ అయినట్టు తెలుస్తోంది. దీంతో డ్యామేజీ అయిన ఫర్నిచర్ వరకు లెక్క కట్టి సొమ్ము చెల్లిస్తారా? లేక.. ఏం చేస్తారనేది చూడాలి.ఏదేమైనా.. ఫర్నిచర్వివాదానికి చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
This post was last modified on June 19, 2024 2:25 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…