టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఇప్పుడు అందరికీ ఆరాధ్యుడిగా మారిపోయారు. గత 2014-19 మధ్య ఆయన పాలన చేశారు. ఆయన పాలన ఉమ్మడి ఏపీకి, విభజిత ఏపీకి కూడా కొత్తకాదు. కానీ, ఇప్పుడు మాత్రమే చంద్రబాబు కు ఎనలేని.. గుర్తింపు.. ప్రజల్లోనూ ఆరాధ్య భావం రెట్టింపు అయ్యాయి. సాధారణం గా చంద్రబాబుపై సానుభూతి ఉండడం వేరు.. కానీ, ఇప్పుడు మాత్రం చంద్రబాబు అంటే.. ఒక రకమైన పిచ్చి ఏర్పడింది. మరి దీనికి కారణం ఏంటి?
1) తనను తాను తగ్గించుకోవడం: సీనియార్టీ పరంగా చూస్తే.. ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకు.. ముఖ్యమంత్రి అయిన వారిలో ఎన్టీఆర్ తర్వాత.. చంద్రబాబే సీనియర్గా ఉన్నారు. ఈ భావనతోనే గతంలో ఆయన కొంత డిస్టెన్స్ పాటించారు. కానీ, ఇప్పుడు ఆ హద్దులు చెరిపి వేశారు. అందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తనను తాను తగ్గించుకుని.,. తాను ఎక్కువ కాదనే సందేశాన్ని పంపిస్తున్నారు. కూటమి పార్టీలతో కలివిడిగా ఉంటున్నారు.
2) ఫీల్ గుడ్: చంద్రబాబు హయాంలో వ్యాపారాలు.. సంస్థల ఏర్పాటు విషయంలో ఫీల్ గుడ్ అనే భావన పెరుగుతుంది. ఇది గతంలోనూ ఉంది. అయితే.. అప్పటికి ఇప్పటికి మరింత మార్పు అయితే.. కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు పాలన విషయంలో వ్యాపార వేత్తలు.. మరింత ముందుకు వస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ కారణంగానే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.
3) పోలీసింగ్: రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేయడంలో చంద్రబాబు ముందున్నారు. గతంలో ఫ్యాక్షన్ జిల్లాలుగా పేరున్న కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయన ఫ్యాక్షన్ను అణిచేశారు. ఎక్కడా ఎవరిపైనా రాజకీయ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన సందర్భాలు కూడా లేవు. ఇది ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ముందుగానే ఆయన పోలీసును ఈ విషయంలో హెచ్చరించారు. ఇది కూడా.. సాధారణ ప్రజల్లో చంద్రబాబును హైలెట్ చేస్తోంది. దీంతో బాబు పాలనపై పిచ్చి పెరిగిపోయిందని వాదన వినిపిస్తోంది.
This post was last modified on June 19, 2024 3:37 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…