Political News

మ‌న‌సు మార్చుకున్న జ‌గ‌న్.. అసెంబ్లీకి అడుగులు!

వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న మ‌న‌సు మార్చుకున్నారు. అసెంబ్లీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని జ‌గ‌న్ భావించారు. అందుకే.. చాలా హుషారుగా ఆయ‌న ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. లండ‌న్ స‌హా విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. కానీ, ఆయ‌న ఆశించిన‌ట్టు ఫ‌లితం రాలేదు. పూర్తిస్థాయి మెజారిటీ ద‌క్క‌క పోయినా.. క‌నీస మెజారిటీతో అయినా.. ఒడ్డున ప‌డతామ‌ని భావించిన వైసీపీ నాయ‌కులు జ‌నాలు షాకిచ్చారు. ప్ర‌తి ప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని రీతిలో 11 స్థానాలకు ప‌రిమితం. ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కాలంటే 15 శాతం సీట్లు ఉండాలి.

అంటే వైసీపీకి క‌నీసం 18 స్థానాలు ద‌క్కి ఉండాలి. కానీ, ప్ర‌జ‌లు మాత్రం వైసీపీని 11 స్థానాల‌కే ప‌రిమితం చేశారు. దీంతో 151 స్థానాల‌తో గంభీరంగా అసెంబ్లీలో అడుగు పెట్టిన జ‌గ‌న్‌.. ఇప్పుడు 11 మందితో అసెంబ్లీకి వెళ్లాలంటే.. తీవ్ర అవ‌మానంగా వైసీపీ నాయ‌కులు భావించారు. దాదాపు జ‌గ‌న్ కూడా ఇదే విష‌యంపై అంత‌ర్మ‌థ‌నం చెందారు. ఇక‌, అసెంబ్లీకి వెళ్లరాద‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కూడా ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పాయి. కానీ, త‌ర్వాత‌.. మేదావులు. స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌గా.. ఇలా చేస్తే.. వైసీపీపై అధికార ప‌క్షం మరింత దాడి చేస్తుంద‌న్న సూచ‌న‌లు వ‌చ్చాయి.

దీంతో తాజాగా జ‌గ‌న్ మ‌న‌సు మార్చుకున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేపథ్యంలో త‌న షెడ్యూల్లోనూ మార్పులు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వ‌హించాల‌ని అనుకున్న ఆయ‌న దీనిని ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే నిర్వహించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఆ రోజు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని పేర్కొంది.

అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు(ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక‌, బుధ‌వా రం పులివెందుల పర్యటనకు వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దీనిని కూడా వాయిదా వేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యార‌నే చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on June 19, 2024 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

44 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago