ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలో ఉండగా.. రాష్ట్రానికి జీవనాడి కాగలదనుకున్న పోలవరం ప్రాజెక్టును ఎంత నిర్లక్ష్యం చేసిందో తెలిసిందే. చంద్రబాబు హయాంలో 75 శాతం దాకా ప్రాజెక్టు పూర్తి కాగా అదే స్థాయిలో కృషి కొనసాగి ఉంటే 2022లోనే రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేది. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
తొలి రెండున్నరేళ్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కానీ.. ఆ తర్వాత ఆ మంత్రిత్వ శాఖను నడిపిన అంబటి రాంబాబు కానీ ఈ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. పోలవరానికి సంబంధించి మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తే.. తనకు సబ్జెక్ట్ తెలియదని.. మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పాలా అని ప్రశ్నించిన ఘనత అంబటికే దక్కుతుంది.
కాగా అధికారం కోల్పోయి ఇప్పుడు మాజీ అయ్యాక కూడా అంబటి రాంబాబు తీరు మారలేదు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన చేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం గురించి వివరించారు. 2022లోనే నీళ్లు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఇంకో నాలుగేళ్లకు కానీ పూర్తయ్యే అవకాశం లేదని చెబుతూ ఆవేదన చెందారు. దీనికి కౌంటర్గా ఈ రోజు అంబటి ప్రెస్ మీట్ పెట్టి.. ఇప్పుడు చంద్రబాబు చెప్పిందే తాను గతంలో చెప్పానని చెప్పుకొచ్చారు.
తాను ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాక చాలామంది నిపుణులతో మాట్లాడానని.. వాళ్లందరితో మాట్లాడాక అర్థమైంది ఏంటంటే.. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని, అదే విషయాన్ని తాను మొట్టమొదటగా చెప్పానని.. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నానని అంబటి అన్నారు. పోలవరం ప్రాజెక్టు అసలు ఎవ్వరికీ అర్థం కాదని.. ఎందుకంటే అది తనకు అర్థం కాలేదని అంబటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
కొసమెరుపు ఏంటంటే… చంద్రబాబు నిన్న చెప్పింది నాశనం చేశారు దీనిని అర్థం చేసుకుని మళ్లీ డ్యామేజీ కంట్రోల్ చేసి పునర్నిర్మాణం చేయడానికి చాలా కాలం పట్టొచ్చు, నాలుగేళ్లు అవ్వచ్చు అన్నారు. అంటే త్వరలో ఒక నివేదిక వచ్చాక సమయం చెప్పొచ్చు అన్నది చంద్రబాబు భావన. కానీ ముందే కూసిన కోయిలలా చూశావా నేను చెప్పిందే చంద్రబాబు చెప్పాడు అంటూ అంబటి తొందరపడ్డారు.
This post was last modified on June 18, 2024 6:17 pm
నేచురల్ స్టార్ నాని నుంచి ‘హిట్-3’ లాంటి వయొలెంట్ ఫిలిం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇందులో వయొలెన్స్ వేరే లెవెల్లో…
పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ దాడులకు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించుకుని.. కాల్పుల…
ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి సినిమాల్లోకి వెళ్తాం అని అంటే.. కంగారు పడేవాళ్లే కుటుంబ సభ్యులే ఎక్కువ. బ్యాగ్రౌండ్ లేకుండా…
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.…
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…