Political News

ఎలా జస్టిఫై చేసుకుంటావ్ జగన్?

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు అధికారం చెలాయించిన వైఎస్ జగన్ సర్కారు… తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చేసిన పనులన్నీ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారి ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. 2019లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన ఇంట్లో వినియోగిస్తున్న ఫర్నిచర్ విషయంలో ఎలా కేసులు పెట్టి వేధించారు, చివరికి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి తీసుకొచ్చారు అన్నది తెలిసిందే.

ఇప్పుడు మాజీ సీఎం జగన్ సైతం ఇలాంటి వివాదంలోనే చిక్కుకుని తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అప్పుడు కోడెల మీద పెట్టినట్లే జగన్ మీద కేసులు పెడితే తప్పేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీఎంగా ఉండగా జగన్ ఇంటి ముందు మూడు రోడ్లను ఆక్రమించి రాకపోకలు లేకుండా నిషేధం విధించిన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఆ రోడ్లను జనం కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆ రోడ్ల మీద జనాలతో మీడియా వాళ్లు మాట్లాడిస్తుంటే.. జగన్ చర్యల మీద వాళ్ల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ఇలా అధికారంలో ఉండగా జగన్ అండ్ కో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి ఆ పార్టీ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని రుషికొండ మీద జగన్ నిర్మించుకున్న విలాసవంతమైన భవనం తాలూకు వ్యవహారం ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ బిల్డింగ్ కడుతున్నపుడు సీఎం క్యాంపు కార్యాలయం కోసమే దాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇప్పుడేమో అది టూరిజం కోసం కట్టిన ప్రభుత్వ భవనం అంటూ మాట మార్చేశారు.

ఆ బిల్డింగ్ లోపల బాత్రూం కమోడ్, బాత్ టబ్ లాంటి వాటికి పెట్టిన లక్షల ఖర్చు గురించి తెలుసుకుని జనం అవాక్కవుతున్నారు. జనం సొమ్ముతో ఇంత విలాసవంతమైన భవనం కట్టుకుంటారా.. ఏకంగా 550 కోట్లు ఖర్చు పెడతారా అని ప్రజలు మంటెత్తిపోతున్నారు. శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని, తమను ఎవ్వరూ ఏమీ ప్రశ్నించలేరని జగన్ అండ్ కో ఇలా అడ్డగోలుగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రుషికొండ ప్యాలెస్ సహా పలు అంశాల్లో జగన్ అండ్ కో అసలు ఏమని జస్టిఫై చేసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

This post was last modified on June 17, 2024 7:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

12 minutes ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

36 minutes ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

45 minutes ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

1 hour ago

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

2 hours ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago