విశాఖపట్నం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నగరం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిపాలన రాజధానిగా విశాఖను చేసుకుని రుషికొండ ప్యాలెస్ నుంచి పాలన నిర్వహిద్దామనుకున్నారు. కానీ బ్యాడ్లక్. ప్రజలు ఓట్లతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. రాజకీయ, ఐటీ, పారిశ్రామిక రంగాల పరంగా కీలకమైన విశాఖపై ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసింది. పొలిటికల్గా ఇక్కడ మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టిన ఆయన వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని సమాచారం. అందుకు లోకేశ్కు కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఇప్పుడు పెద్ద నగరంగా ఉన్న విశాఖను కేంద్రంగా చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. అందుకే విశాఖ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా నారా లోకేశ్కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశముందని అంటున్నారు. జిల్లా ఇంఛార్జీ మంత్రి నాయకత్వంలోనే విశాఖలో పాలన జరిగే అవకాశముంది. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేశ్ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ పరంగా అభివృద్ధి చేయాలన్నా లోకేశ్కు ఇక్కడ పట్టు ఉండటం అవసరం.
అలాగే విశాఖను పారిశ్రామికంగానూ మరింత డెవలప్ చేయాలనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇక్కడ వైసీపీ అడ్రస్ లేకుండా చేసి, టీడీపీని మరింత బలోపేతం చేయాలన్నది బాబు లక్ష్యం. అందుకే అన్ని విధాలుగా విశాఖపై పట్టు సాధించేందుకు లోకేశ్కు బాబు బాధ్యతలు అప్పజెప్పే అవకాశముందని తెలిసింది. లోకేశ్ ద్వారా విశాఖపై బాబు నేరుగా మానిటరింగ్ చేసే ఆస్కారముంది.
This post was last modified on June 17, 2024 7:08 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…