అక్కడ ఏపీలో జగన్ పార్టీ ఓడిపోగానే ఇక్కడ హైదరాబాద్లోని ఆయన నివాసం ముందు జీహెచ్ఎంసీ కూల్చివేతలు సంచలనంగా మారాయి. లోటస్పాండ్లోని నివాసం ముందు సెక్యూరిటీ రూమ్లు, ఇతర నిర్మాణాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ వాటిని కూల్చివేసింది. కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కూల్చివేతలు చేపట్టారని సంబంధిత అధికారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ నిర్మాణాలను కూల్చడం వెనుక ఓ తెలంగాణ మంత్రి ఉన్నారనే సంగతి తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఓ మంత్రి ఈ నిర్మాణాలను కూల్చివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. దీంతో ఆ అధికారి వెంటనే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అయితే దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. అందుకే వెంటనే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై వేటు పడింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఈ నిర్మాణాలను కూల్చేయడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
అయితే దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్లో కీలక మంత్రి ప్రమేయంతో ఈ కూల్చివేతలు జరిగాయనే ప్రచారం జోరందుకుంది. ఆ మంత్రి అటు వైపు ఎక్కువగా రాకపోకలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆ మంత్రి నేరుగా ఫోన్ చేసి జోనల్ కమిషనర్కు చెప్పడంతోనే ఈ ఆక్రమణలను తొలగించారు. కానీ దీనికి ఆ అధికారిని బాధ్యుడిగా చేస్తూ చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలు కూల్చేసిన అధికారిపై చర్యలు తీసుకోవడం ఏమిటని జనాలు ప్రశ్నిస్తున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…