Political News

జగన్ ఇంటి వద్ద ప్రైవేటు సైన్యం !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ఉపయోగించుకోవడంతో ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జగన్‌ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. దీంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఇన్నిరోజులు ఆంక్షలు ఉండటంతో.. ఇబ్బందులు పడ్డామని, ఆంక్షలు ఎత్తేయడంతో ఇబ్బందులు తీరాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ప్రభుత్వం భద్రతను తగ్గించడం, ఆంక్షలు సండలించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు మాజీ సీఎం జగన్. దీంతో పాటు మాజీమంత్రులు, వైసీపీ నేతలు, కార్యాలయాల మీద దాడులు జరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి సహకారం ఉండదని భావించి తాడేపల్లి నివాసం దగ్గర 30మంది సెక్యూరిటీని సొంతంగా నియమించుకున్నారు.

జగన్ ఇంటి ముందు కొంతమంది, ఇంటి లోపల కొంతమంది రక్షణగా ఉంటూ వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు.

2019 నుంచి మొన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తాడేపల్లి నుంచి అన్ని కార్యక్రమాలు సాగించారు. పార్టీ పరంగా రివ్యూలు, కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకున్నారు జగన్. ఎన్నికల వ్యూహాలు ఇక్కడి నుండే రూపొందించారు. ఎన్నికల్లో ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ ఇంటి దగ్గర భద్రతను భారీగా తగ్గించిన నేపథ్యంలో సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు.

This post was last modified on June 17, 2024 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

50 రోజులు.. మూడు డిజాస్టర్లు

కాస్త పేరున్న హీరో సినిమాలు 50 రోజుల వ్యవధిలో మూడు రిలీజ్ కావడమే అరుదు. ఆ మూడు కూడా ఒకదాన్ని…

21 mins ago

బీఆర్ఎస్ కొరివితో తల గోక్కుంటోందా?

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ పడగా.. ఆ పార్టీకి మెజారిటీ సీట్లు…

22 mins ago

జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా…

11 hours ago

అండ‌మాన్ రాజ‌ధాని పేరు మార్పు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అండ‌మాన్ నికోబార్ దీవుల రాజ‌ధాని…

11 hours ago

రవితేజ మిస్…బాలయ్య ఫిక్స్

2025 సంక్రాంతికి బెర్తులు మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ఖరారు చేసుకున్న వాటిలో జనవరి 10 చిరంజీవి విశ్వంభరలో ఎలాంటి మార్పు లేదు.…

11 hours ago

జ‌గ‌న్ ‘వెక్కిరింపు’ రాజ‌కీయాలు!

ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ కు పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా.. కాకినాడ జిల్లా ప‌రిధిలోని 62 గ్రామాలు నీట మునిగాయి. వీటి లో…

12 hours ago