Political News

జ‌గ‌న్ అందుకే ఓడిపోయాడు: రాజా సింగ్

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయిన విష‌యం తెలిసిందే. క‌వేలం 11 స్థానాల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మై.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక పోయింది. అస‌లు అసెంబ్లీకి వెళ్తారో లేదో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

ఘోర ప‌రాభ‌వం ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా ప్ర‌జ‌లకు మొహం చూపించ‌లేక పోతున్నారు. ఇక‌, మాజీ సీఎం జ‌గ‌న్ మాత్రం విడ‌త‌ల వారీగా .. త‌న వారితో భేటీ అయి.. కొంత మేర‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాము ఓడిపోయినా భ‌య‌ప డాల్సిన ప‌నిలేద‌ని.. ప్ర‌జ‌లు 40 శాతం ఓట్లు త‌మ‌కే వేశార‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎందుకు కూలిపోయిందో ఆయ‌న విశ్లేషించారు. ఈ మేర‌కు ఆయ‌న సెల్ఫీ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

తొలుత ఆయ‌న నూత‌న ముఖ్య‌మంత్రి, టీడీపీ సార‌థి.. చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం.. జ‌గ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు సంధించారు. ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌ను అన్య మ‌త ప్ర‌చారానికి వాడుకున్నార‌ని వ్యాఖ్యానించారు. క‌న్వ‌ర్టెడ్ క్రిస్టియ‌న్ల చేతిలో తిరుమ‌ల‌ను పెట్టి స్వామివారిని, స్వామి వారి భ‌క్తుల‌ను కూడా క్షోభ‌కు గురి చేశార‌ని రాజాసింగ్ అన్నారు.

తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్ నుంచి ఈవో వ‌ర‌కు అంద‌రినీ క‌న్వ‌ర్టెడ్ క్రిస్టియ‌న్ల‌ను నియ‌మించార‌ని రాజా సింగ్ తెలిపారు. అంతేకాదు.. మ‌ద్యం, మాంసాల‌ను కూడా.. తిరుమ‌ల‌పైకి అనుమ‌తించి..తిరుమల ప‌విత్ర‌త‌కు తీవ్ర భంగం క‌లిగించార‌ని అందుకే స్వామి క‌న్నెర్ర చేశార‌ని.. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ కుప్ప‌కూలిపోయింద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని తాను గతంలోనే ఒక‌సారి హెచ్చ‌రించిన‌ట్టు రాజాసింగ్ తెలిపారు.

ప్ర‌స్తుతం ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అయినా.. తిరుమ‌ల ప‌విత్ర‌త‌త‌ను కాపాడాల‌ని.. అన్య‌మ‌త‌స్తుల‌కు చోటు లేకుండా.. చూడాల‌ని ఆయ‌న విన్న వించారు. హిందూ మ‌త‌స్తుల‌కే ఉద్యోగాలు.. ప‌ద‌వులు ఇవ్వాల‌ని అన్నారు.

This post was last modified on June 15, 2024 9:09 pm

Share
Show comments
Published by
satya
Tags: Raja Singh

Recent Posts

ఏపీలో ముదిరిన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం

ఏపీలో కీల‌క‌మైన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం ముదిరింది. వైసీపీ హ‌యాంలో 2019లో నియ‌మితులైన వ‌లంటీర్ల విష‌యం.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు…

27 mins ago

డార్లింగ్ చెప్పేసిన కల్కి 2 శుభవార్త

కల్కి 2898 ఏడికి సంబంధించి అందరి మనస్సులో ఉన్న ప్రశ్న ఒక్కటే. దీనికి సీక్వెల్ ఉంటుందా లేదాని. కొన్ని లీక్స్…

46 mins ago

ఉస్తాద్ లేటన్నాడు….జాన్ ఫిక్సయ్యాడు

తమిళ బ్లాక్ బస్టర్ తేరిని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి…

2 hours ago

భైరవ ఎంట్రీకి ముందే ప్రిపేరవ్వాలి

మరికొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న కల్కి 2898 ఏడి ఎదురు చూపులు నిమిషాలను సైతం యుగాలుగా మార్చేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్…

3 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గ‌త నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో…

4 hours ago

చరణ్ అభిమానుల్లో టెన్షన్

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల…

4 hours ago