కలిశెట్టి అప్పలనాయుడు. ఈ పేరుకు ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీడీపీలో సాధారణ కార్యకర్త అయిన అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు.
అనేకమంది అభ్యంతరాలు చెప్పినా తాను పట్టించుకోలేదని స్వయంగా వెల్లడించిన చంద్రబాబు ఫలితాల తర్వాత జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ‘ఏం అప్పలనాయుడు ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నావా ? లేదంటే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు’ అంటూ అప్పలనాయుడును ఆరాతీయడంతో ఆయన బాబు వాత్సల్యానికి చలించిపోయిన విషయం తెలిసిందే.
అయితే గెలిచిన ఎంపీలంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే ఎంపీ అప్పలనాయుడు మాత్రం అప్పుడే డ్యూటీ ఎక్కేశాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మెట్టవలసలోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ను గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులు, గ్రామస్థులతో ముచ్చటించి విద్యా బోధన, హాస్టల్లోని వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి రాత్రికి హాస్టల్లోనే నిద్రించాడు.
ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, తన వంతుగా హస్టల్ కు కావాల్సిన ఫ్యాన్లను, మరి కొన్ని సదుపాయాలను సమకూర్చాడు. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని కాకుండా స్థానికులు సైతం కొంత చొరవ చూపి హాస్టల్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని విన్నవించారు.
మెట్టవలసలోని ఇదే హాస్టల్ లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్పలనాయుడు చదువుకోవడం విశేషం. తాను గతంలో చదువుకున్న హాస్టల్ను సందర్శించి అక్కడి అవసరాల్ని తీర్చే ప్రయత్నం చేయడం అభినందనీయం.ఇలా ఎంపీ అయ్యాడో లేదో అప్పుడే ఆకస్మిక తనిఖీలు, రాత్రి నిద్రలు చేయటంపై ప్రజల నుండి ప్రశంసలు వస్తున్నాయి.
This post was last modified on June 15, 2024 12:56 pm
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…