పుష్ప 2 ది రూల్ వాయిదా గురించి విపరీతమైన చర్చ ఒకపక్క జరుగుతూ ఉండగానే ఇంకోవైపు ఆ డేట్ ని పట్టేసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. ఆగస్ట్ 15 లాంగ్ వీకెండ్ ఉన్న మంచి తేదీ కావడంతో ఆ అవకాశాన్ని వదులునేందుకు ఇతర నిర్మాతలు ఇష్టపడటం లేదు. అయితే డబుల్ ఇస్మార్ట్ శంకర్ బృందం డబుల్ తెలివితేటలతో ఆలోచించి తమ సినిమాని ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ వదిలేసింది. దీంతో అధికారికంగా ఆ స్లాట్ లో వచ్చిన మొదటి ప్యాన్ ఇండియా మూవీగా డబుల్ ఇస్మార్ట్ కు ఫస్ట్ ఎడ్జ్ దొరికేసింది.
నిజానికి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ డబుల్ ఇస్మార్ట్ జూలైలో తేవాలని దర్శకుడు పూరి జగన్నాధ్ విశ్వప్రయత్నం చేశారు. కానీ షూటింగ్ లో జాప్యం, ఓటిటి డీల్, సంజయ్ దత్ డేట్లు లాంటి బోలెడు కారణాలు ఆలస్యానికి దారి తీశాయి. ప్రస్తుతం కీలక షెడ్యూల్ చివర్లో ఉన్న ఈ మాస్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన టీజర్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ రిలీజైన సంగతి తెలిసిందే. దానికొచ్చిన మిశ్రమ స్పందనని దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ కట్ ప్రత్యేకంగా చేయిస్తున్నారట. మణిశర్మ స్వరపరిచిన పాటల తాలూకు లిరికల్ వీడియోలు ఈ నెలాఖరు నుంచే రాబోతున్నాయి.
మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 పోస్ట్ పోన్ గురించి చెప్పకపోయినా ఇప్పుడు పూరి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. రామ్ కు అత్యవసరంగా హిట్టు కావాల్సిన టైంలో వస్తున్న సినిమా ఇది. లైగర్ డిజాస్టర్ చేసిన గాయం నుంచి బయటపడి మళ్ళీ తన సత్తా చాటుకునేందుకు పూరి జగన్నాధ్ కు ఇదే చావో రేవో ఆటగా మారిపోయింది. ఇస్మార్ట్ శంకర్ కు మించిన డోస్ ఇందులో ఉంటుందనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది. ది వారియర్, స్కందల తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిది. తెలుగులో పుష్ప 2 కాకుండా అఫీషియల్ గా ఆ డేట్ ని లాక్ చేసింది ఇప్పటికి డబుల్ ఇస్మార్ట్ ఒక్కటే.
This post was last modified on June 15, 2024 3:59 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…