కృష్ణాజిల్లాలో నిలకడలేని నేతల పేర్లు చెప్పమంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది వంగవీటి రాధాకృష్ణ పేరునే చెప్పుకోవాలి. వంగవీటి పేరే ఎందుకింతగా జనాలకు గుర్తుంటుందంటే ఆయన అన్ని పార్టీలు మారారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టిన రాధా తర్వాత అంటే 2009లో ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి వైసిపిని ఏర్పాటు చేశారు. పిఆర్పీతో పాటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళటం ఇష్టంలేని రాధా వైసిపిలో చేరిపోయారు.
వైసిపిలో చేరిన రాధాకు జగన్ మంచి ప్రాధాన్యతే ఇచ్చారని పార్టీ నేతలు ఇప్పటికి చెప్పుకుంటారు. విజయవాడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జగన్ ఎంతగా ప్రోత్సహించాలని అనుకున్నా రాధా మాత్రం దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. నిజానికి చాలామంది నేతలకు లేని బ్రహ్మాండమైన లాంచింగ్ ప్యాడ్ రాధాకుంది. వంగవీటి అనగానే ఇప్పటికీ చాలామందికి వంగవీటి రంగానే గుర్తుకొస్తుంది. కృష్ణజిల్లాలో ప్రత్యేకించి విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా ముద్ర చాలా బలంగా ఉందనే చెప్పాలి. రంగా కొడుకు రాధా బరిలోకి దిగుతున్నాడంటే ప్రత్యర్ధిపార్టీలు షేకైపోవాలి.
అలాంటి బలమైన నేపధ్యం నుండి వచ్చిన రాధా ఇపుడు తరచూ పార్టీలు మారుతున్నాడంటే ఏమిటర్ధం ? ఏ పార్టీలోను నిలకడగా ఉండటం లేదు. అంటే పార్టీల అధినేతలతో రాధాకు పొసగటం లేదని తెలిసిపోతోంది. వైసిపి నుండి మొన్నటి ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో వైసిపిలో చేరలేక ఘోరంగా ఓడిపోయిన టిడిపిలో కంటిన్యు అవ్వలేక అందులో నుండి కూడా బయటకు వచ్చేశారు. టిడిపి నుండి బయటకు వచ్చేయగానే జనసేన వైపు చూశారు. పోనీ జనసేనలో అన్నా చేరారా అంటే అదీలేదు.
జనసేనలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ తో ఒకసారి అధినేత పవన్ తో మరోసారి భేటి అయ్యారే కానీ పార్టీలో చేరలేదు. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రాధా పేరు మళ్ళీ ఇఫుడు వినబడుతోంది. తొందరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే రాధాకు పార్టీ అవసరం బిజెపికి నేతలవసరం. కాబట్టి పరస్పర అవసరాలను దృష్టిలో పెట్టుకునే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో టచ్ లోకి వెళ్ళారనేది సమాచారం. మరి బిజెపిలో చేరుతారో లేదో చెప్పలేకున్నారు. ఈ మొత్తం రాజకీయ ప్రస్ధానాన్ని చూస్తే రాధాలోనే లోపముందన్న విషయం తెలిసిపోతోంది. కీలక నేతలతో సయోధ్య లేకపోవటం, అధినేతలతో పడకపోవటమే రాధాకున్న అసలైన సమస్య. మరి బిజెపిలో చేరితే అన్నా రాధా స్ధిరమైన రాజకీయాలు చేస్తారా ? చూడాల్సిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…