Political News

విజయసాయివి ఉడుత బెదిరింపులా ?!

ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసేన, వైసీపీ కూటమి చేతిలో చావుదెబ్బ తిన్నది. 21 లోక్ సభ, 151 శాసనసభ స్థానాల నుండి 4 లోక్ సభ, 11 శాసనసభ స్థానాలకు దిగజారిపోయింది.

16 లోక్ సభ స్థానాలతో, జనసేన 2 లోక్ సభ స్థానాలతో దేశంలో ఎన్డీఎ ప్రభుత్వానికి టీడీపీ ఇప్పుడు వెన్నెముకగా నిలిచింది. రాష్ట్రంలో సొంతంగా 135, కూటమితో కలిపి 164 మంది శాసనసభ్యులతో బలంగా నిలబడింది.

ఈ పరిస్థితులలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన పార్టీ ఇంటా, బయటా విమర్శలు కురిపిస్తుంది. ‘‘పార్లమెంటు బిజెపికితో వైసిపితో అవసరం ఉంది. టిడిపికి 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి.

వైఎసీపీకి రాజ్యసభలో 11, లోక్ సభలో 4 సీట్లు కలిపి 15 ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ లో మా బలం తగ్గలేదు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బిజెపికి తమ అవసరం ఉందని గుర్తించాలి’’ అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో పార్టీ ఎంపీల లెక్కచెప్పి బీజేపీని బెదిరించారా ? లేక లాక్కోమని సంకేతాలు ఇచ్చారా ? అన్న చర్చ మొదలయింది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోగానే బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.

ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు జగన్ మీద ఉన్నాయి. అందులో విజయసాయి పాత్ర కూడా ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబును జగన్ జైలుకు పంపిన నేపథ్యంలో చంద్రబాబు అంత తేలిగ్గా జగన్ ను వదిలేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయసాయివి ఉడుత బెదిరింపులా ? ఆత్మరక్షణ దోరణినా ? అని భావిస్తున్నారు.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

43 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

45 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago