Political News

విజయసాయివి ఉడుత బెదిరింపులా ?!

ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసేన, వైసీపీ కూటమి చేతిలో చావుదెబ్బ తిన్నది. 21 లోక్ సభ, 151 శాసనసభ స్థానాల నుండి 4 లోక్ సభ, 11 శాసనసభ స్థానాలకు దిగజారిపోయింది.

16 లోక్ సభ స్థానాలతో, జనసేన 2 లోక్ సభ స్థానాలతో దేశంలో ఎన్డీఎ ప్రభుత్వానికి టీడీపీ ఇప్పుడు వెన్నెముకగా నిలిచింది. రాష్ట్రంలో సొంతంగా 135, కూటమితో కలిపి 164 మంది శాసనసభ్యులతో బలంగా నిలబడింది.

ఈ పరిస్థితులలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన పార్టీ ఇంటా, బయటా విమర్శలు కురిపిస్తుంది. ‘‘పార్లమెంటు బిజెపికితో వైసిపితో అవసరం ఉంది. టిడిపికి 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి.

వైఎసీపీకి రాజ్యసభలో 11, లోక్ సభలో 4 సీట్లు కలిపి 15 ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ లో మా బలం తగ్గలేదు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బిజెపికి తమ అవసరం ఉందని గుర్తించాలి’’ అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో పార్టీ ఎంపీల లెక్కచెప్పి బీజేపీని బెదిరించారా ? లేక లాక్కోమని సంకేతాలు ఇచ్చారా ? అన్న చర్చ మొదలయింది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోగానే బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.

ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు జగన్ మీద ఉన్నాయి. అందులో విజయసాయి పాత్ర కూడా ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబును జగన్ జైలుకు పంపిన నేపథ్యంలో చంద్రబాబు అంత తేలిగ్గా జగన్ ను వదిలేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయసాయివి ఉడుత బెదిరింపులా ? ఆత్మరక్షణ దోరణినా ? అని భావిస్తున్నారు.

This post was last modified on June 14, 2024 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

48 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago