Political News

ఇంకా ప‌ర‌దాలు అలవాటు వదలని అధికారులు

ఏపీ స‌ర్కారులో గ‌త ఐదేళ్లుగా కొన్ని అలవాట్ల‌కు అలవాటు ప‌డిన అధికారులు.. ఇంకా వాటిని వ‌దిలించుకోలేక పోతున్నారు. ప‌దేప‌దే టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు చెబుతున్నా.. స‌ద‌రు పాత వాస‌న‌ల‌ను వారువ‌దిలి పెట్ట‌లేక పోతున్నారు.

సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం జ‌రిగిన త‌ర్వాత‌.. చోటు చేసుకున్న రెండు కీల‌క ప‌రిణామాల‌పై ఇప్పుడు స‌ర్కారు కూడా తీవ్రంగా స్పందించింది. దీనిలో ప్ర‌ధానంగా.. ప‌రదాలు క‌ట్ట‌డం. రెండోది ట్రాఫిక్‌ను గంట‌ల‌కొద్దీ నిలిపి వేయ‌డం. ఈ రెండు విష‌యాల‌పై చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కముందే అధికారుల‌ను హెచ్చ‌
రించారు. అలా చేయొద్ద‌ని కూడా చెప్పారు.

గ‌తంలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో.. ఏమోకానీ.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే చాలు.. పోలీసులు అతిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ప‌ర్య‌టించే ప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తున ప‌ర‌దాలు క‌ట్టేసేవారు. దీంతో ఆయ‌న‌కు చుట్టూ కూడా.. అంతా బాగున్న‌ట్టుగా ఉండేది.

ఇక‌, జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో కీల‌క విష‌యం చెట్టు న‌రికేయ‌డం. చిన్న‌దనీ లేదు.. పెద్ద‌ద‌నీ లేదు. అడ్డం వ‌చ్చింద‌ని లేదు.. అవ‌స‌రం లేద‌ని కూడా లేదు. చెట్టుఏదైనా.. ఎన్నేళ్ల‌యినా.. జ‌గ‌న్ వ‌స్తున్న మార్గంలో వాటిని శ‌త్రువుల‌గా చూశారు. తెగ‌న‌రికేశారు.

ఇక‌, జ‌గ‌న్ ఆకాశంలో హెలికాప్ట‌ర్ ద్వారా ప్ర‌యాణించినా.. రోడ్డుపై ఆయ‌న కాన్వాయ్‌లో వెళ్లినా.. గంట‌ల కొద్దీ వాహ‌నాల‌ను నిలిపివేసేవారు. అంతేకాదు.. ఆయ‌న ప‌ర్య‌టించే ప్రాంతాల్లో దుకాణాల‌ను బంద్ చేయించేవారు. రోడ్ల‌పై చిరు వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకునేవారిని కూడా వ‌దిలి పెట్టేవారు.

క‌ట్ చేస్తే.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఎస‌రు పెట్టాయి. వీటిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. తాను గెలిచీ గెల‌వ‌గానే.. సంబంధిత అధికారుల‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. ప‌ర‌దాలు క‌ట్ట‌ద్ద‌ని, చెట్లు న‌ర‌కొద్ద‌ని.. ట్రాఫిక్‌ను ఆపి.. ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ద్ద‌ని కూడా చెప్పారు.

కానీ, అధికారులు ఏమ‌నుకున్నారో.. ఏమో.. జ‌గ‌న్ పాల‌నే ఉంద‌ని భావించారో ఏమో.. తాజాగా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబు వ‌స్తున్న మార్గంలో ప‌ర‌దాలు క‌ట్టారు. దుకాణాలు బంద్ చేయించారు. ఈ విష‌యంలో ఆల‌స్యంగా తెలిసిన నారా లోకేష్‌.. ఇలా ఎందుకు చేస్తున్నార‌ని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. వెంట‌నే వాటిని ఆపాల‌ని కూడా అన్నారు.

ఇక‌, గురువారం మ‌ధ్యాహ్నం.. విజ‌య‌వాడ దుర్గ‌గుడి ద‌ర్శ‌నానికి చంద్ర‌బాబు కుటుంబం రానుంది. ఈ నేప‌థ్యంలో భ‌క్తుల‌ను గంట‌ల కొద్దీ లైన్ల‌లోనే కిక్కిరిసిపోయేలా వ్య‌వ‌హ‌రించారు అధికారులు. అంతేకాదు.. విజ‌య‌వాడ‌లోనూ ట్రాఫిక్‌నిలిపి వేశారు. దీంతో అధికారుల తీరు మార‌డం లేద‌ని. టీడీపీ నాయ‌కులు పేర్కొంటున్నారు. వీరికి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేన‌ని అంటున్నారు.

This post was last modified on June 13, 2024 2:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

38 minutes ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

44 minutes ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

46 minutes ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

3 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

5 hours ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

6 hours ago