అయిదేళ్ళుగా వైసిపి ప్రభుత్వ పాలనతో విసిగి వేసారిన ప్రజానీకం కోరుకున్న క్షణం వచ్చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న నాయకుడు కావాలనే సంకల్పంతో టిడిపి జనసేన బిజెపి కూటమికి భారీ మద్దతు తెలుపడంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను మాటను కోట్లాది ప్రజలు ప్రత్యక్షంగా చూసి వినే అవకాశం దక్కింది.
ఎన్నికల ప్రచారంలో అలుపే తెలియని రీతిలో అహోరాత్రాలు చంద్రబాబు పడిన కష్టానికి, కన్న కలకు ఇవాళ సాక్షాత్కారం దొరికింది. ప్రధాని నరేంద్రమోడీ సహా దిగ్గజ నాయకులెందరో సాక్షులుగా మహోన్నత ఘట్టం ఆవిష్కృతమయ్యింది.
గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపూ సభకు విచ్చేసిన అభిమానులు, కార్యకర్తలు తమ కరతాళధ్వనులతో హర్షాతిరేకం తెలుపుతూనే ఉన్నారు. కక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే తప్పు చేసిన వాళ్ళను వదిలి పెట్టనని చెబుతున్న చంద్రబాబు రాజధాని అమరావతే ఉంటుందని చెప్పడం ద్వారా ప్రజా భీష్ఠానికి అనుగుణంగా తమ పాలన ఉంటుందని నిన్నే చెప్పిన సంగతి తెలిసిందే.
శాసన సభను గౌరవ సభగా చూడాలన్న సంకల్పంతో ఇకపై అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా ప్రతి కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేయడం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
నిన్నటి సమావేశంలో చంద్రబాబు చెప్పినట్టు ఇకపై ఎన్నో సవాళ్లు స్వాగతం చెప్పబోతున్నాయి. ఆర్థిక లోటు, అప్పులు, క్రమ శిక్షణ తప్పిన బడ్జెట్, వ్యవస్థలు అధోగతి పాలు కావడం లాంటివెన్నో సరిచేయాల్సిన బాధ్యత ఉంది.
గతంలో మూడుసార్లు పాలన అందించినప్పటికీ ఎప్పుడూ లేనంత చిక్కుల వలయం ఈసారి కమ్ముకుని ఉంది. ఇవన్నీ సరిచేస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో నిరూపించాల్సిన జవాబుదారితనం టిడిపి కూటమి మీద ఉంది. అందుకే నారా చంద్రబాబునాయుడు అనే నేను కేవలం ప్రమాణం కాదు అంతకు మించిన బరువైన బాధ్యత.
This post was last modified on June 12, 2024 12:25 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…