సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరు ఇప్పుడు సంచలనం. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి అనూహ్యంగా పోటీకి దిగడమే కాకుండా అక్కడ తిరుగులేదు అనుకున్న కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి మీద అదీ బీజేపీ తరపున పోటీ చేసి 3734 ఓట్ల స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు ఏకంగా బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బీజేపీ తరపున గెలిచిన ఎనిమిది మందిలో సత్యకుమార్ కు అవకాశం దక్కడం విశేషం.
బీజేపీ తరపున కీలకమైన జమ్మలమడుగు నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విజయవాడ దక్షిణం నుండి సుజనా చౌదరి, విశాఖ నార్త్ నుేండి పెన్మత్స విష్ణుకుమార్ రెడ్డి, ఆదోని నుండి పార్దసారధి, ఎచ్చెర్ల నుండి ఈశ్వరరావు, కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్, అనపర్తి నుండి నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డిలు గెలిచినా మంత్రి పదవి సత్యకుమార్ కు దక్కడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
సత్య అలియాస్ సత్యకుమార్ అనే పేరు ఢిల్లీ రాజకీయ వర్గాలలో పరిచయం అక్కర్లేని పేరు. మహారాష్ట్ర నుండి వలసవచ్చిన సత్యకుమార్ పూర్వీకులు హిందూపూర్ లో స్థిరపడ్డారు. వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేసిన ఆయన వెంకయ్యనాయుడు రాజకీయాల నుండి తప్పుకున్న అనంతరరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. విద్యార్ధి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండటంతో బీజేపీ నాయకత్వంతో, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలగడంతో అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేసిన సమంలో, యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ సత్యకుమార్ ఆయన వెన్నంటే ఉన్నారు. నమ్మిన బంటుగా ఉన్న సత్యకుమార్ కు వెంకయ్య నాయుడు ఏకంగా తన సమీప బంధువుతో వివాహం జరిపించి మరీ అక్కున చేర్చుకోవడం విశేషం.
2022 మార్చి ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో 403 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ తరపున సత్యకుమార్ 135 స్థానాలకు బాధ్యుడిగా వ్యవహరించాడు. ఈ ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి ఏకంగా 284 స్థానాలలో విజయం సాధించడం విశేషం. ఇందులో బీజేపీ 252, భాగస్వామ్య పక్షాలు 32 స్థానాలలో విజయం సాధించాయి. ఇంత నేపథ్యం ఉంది కాబట్లే సత్యకుమార్ ఈసారి ఏపీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడని చెప్పాలి.
This post was last modified on June 12, 2024 10:04 am
భారతదేశంలో డాక్టర్ వృత్తికి ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్లుగా…
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే…
తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీలకంగా మారున్నాయి. ఒకవైపు…
అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ…
రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా..…
ఉదయం నుంచి ఎప్పుడెప్పుడా అని తెగ వెయిటింగ్ లో పెట్టిన పెద్ది సెకండ్ సింగల్ వచ్చేసింది. నిజానికి సాయంత్రం ఏడు…