ఏపీలో తన సోదరుడి ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పుడు మరోసారి విజృంభించేందుకు రెడీ అవుతున్నారా? తెరవెనుక పూర్తిస్థాయిలో మంతనాలు సాగుతున్నాయా? ఆమె దూకుడుతో.. వైసీపీ మూలాలు కదిలిపోయే ప్రమాదం దాపురించిందా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు.. కనిపిస్తున్న అవకాశాలు వంటివి పెద్ద ఎత్తున వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
వైసీపీ అధికారం కోల్పోయి.. వారం రోజులు అయింది. అయితే.. ఇప్పటి వరకు వైసీపీ ఓటమికి బాధ్యులు ఎవరనే విషయంపై చర్చ సాగుతూనే ఉంది. అయితే.. కొందరు మాత్రం ఇప్పటికే తమ ఓటమికి జగన్ కారణమని తేల్చేశారు. ముఖ్యంగా సీమ ప్రాంత రెడ్డి సామాజికవర్గం జగన్ వైఖరిపై నిప్పులు చెరుగుతోంది. అందుకే ఇన్ని రోజులు గడిచినా.. ఇప్పటి వరకు సీమ ప్రాంతానికి చెందిన కీలకరెడ్డి నాయకులు ఎవరూ కూడా.. జగన్ను కలుసుకునేందుకు రాలేదు.
ఈ పరిణామాల వెనుక వ్యూహాత్మక రాజకీయం సాగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. షర్మిలను రంగంలోకి దింపి.. కీలక రెడ్డి సామాజిక వర్గాన్ని మరోసారి కాంగ్రెస్ వైపు మళ్లిస్తారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం సైలెంట్గా ఉన్నప్పటికీ తెరవెనుక చేయాల్సిన పనులు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే షర్మిలకు రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో షర్మిల మరింత యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అనంతరం.. వైసీపీలోకి కీలక నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఆమె టచ్లోకి వెళ్లారని చెబుతున్నారు. అందుకే కీలకమైన రెడ్డి సామాజిక వర్గం మౌనంగా ఉందని తెలుస్తోంది. వీరు కనుక సంఘటితమైతే.. వైఎస్ వారసురాలిగా షర్మిలను గుర్తించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఆమెను నాయకురాలిగా గుర్తించే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 11, 2024 7:54 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…