నిన్న మొన్నటి వరకు గజం రూ.3500 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 45000ల రూపాయలకు చేరిపోయింది. ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి రాకముందే.. అమరావతి ప్రాంతంలో బాగుచేతలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు పట్టిపోయిన పరికరాలు.. దుమ్ము పట్టడాలను బాగు చేస్తున్నారు. ఇదేసమయంలో తుమ్మ చెట్లు కొట్టేస్తూ.. రహదారులను కూడా నిర్మిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరోసారి కార్యకలాపాలు ప్రారంభించారు.
ఇక, సమీపంలోని గుంటూరు, విజయవాడ నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల 1వ తేదీ వరకు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 40-45 లక్షల మధ్య ఉండగా.. ఇప్పుడు 50 లక్షల పైమాటే పలుకుతున్నాయి. ఇక, నిర్మాణంలో ఉన్న వాటిని హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు. ఎటు చూసినా.. రియల్ ఎస్టేట్ సందళ్లు.. కార్మికుల గలగలలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల పనివారు కూడా.. ఇప్పుడు బిజీ అయిపోయారు.
బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తీసుకునే నిర్ణయాలతో రియల్ బూమ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి వారంలోనే ఇసుక విధానంపై సమీక్షించనున్నారు. దీంతో ఈ హడావుడి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అలానే కొనుగోలు దారులు కూడా.. గతంలో హైదరాబాద్ వైపు చూడగా ఇప్పుడు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనేకొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ బూమ్ ఊహించని విధంగా జోరు అందుకోవడం గమనార్హం.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…