నిన్న మొన్నటి వరకు గజం రూ.3500 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 45000ల రూపాయలకు చేరిపోయింది. ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి రాకముందే.. అమరావతి ప్రాంతంలో బాగుచేతలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు పట్టిపోయిన పరికరాలు.. దుమ్ము పట్టడాలను బాగు చేస్తున్నారు. ఇదేసమయంలో తుమ్మ చెట్లు కొట్టేస్తూ.. రహదారులను కూడా నిర్మిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరోసారి కార్యకలాపాలు ప్రారంభించారు.
ఇక, సమీపంలోని గుంటూరు, విజయవాడ నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల 1వ తేదీ వరకు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 40-45 లక్షల మధ్య ఉండగా.. ఇప్పుడు 50 లక్షల పైమాటే పలుకుతున్నాయి. ఇక, నిర్మాణంలో ఉన్న వాటిని హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు. ఎటు చూసినా.. రియల్ ఎస్టేట్ సందళ్లు.. కార్మికుల గలగలలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల పనివారు కూడా.. ఇప్పుడు బిజీ అయిపోయారు.
బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తీసుకునే నిర్ణయాలతో రియల్ బూమ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి వారంలోనే ఇసుక విధానంపై సమీక్షించనున్నారు. దీంతో ఈ హడావుడి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అలానే కొనుగోలు దారులు కూడా.. గతంలో హైదరాబాద్ వైపు చూడగా ఇప్పుడు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనేకొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ బూమ్ ఊహించని విధంగా జోరు అందుకోవడం గమనార్హం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…