నిన్న మొన్నటి వరకు గజం రూ.3500 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 45000ల రూపాయలకు చేరిపోయింది. ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి రాకముందే.. అమరావతి ప్రాంతంలో బాగుచేతలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు పట్టిపోయిన పరికరాలు.. దుమ్ము పట్టడాలను బాగు చేస్తున్నారు. ఇదేసమయంలో తుమ్మ చెట్లు కొట్టేస్తూ.. రహదారులను కూడా నిర్మిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరోసారి కార్యకలాపాలు ప్రారంభించారు.
ఇక, సమీపంలోని గుంటూరు, విజయవాడ నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల 1వ తేదీ వరకు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 40-45 లక్షల మధ్య ఉండగా.. ఇప్పుడు 50 లక్షల పైమాటే పలుకుతున్నాయి. ఇక, నిర్మాణంలో ఉన్న వాటిని హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు. ఎటు చూసినా.. రియల్ ఎస్టేట్ సందళ్లు.. కార్మికుల గలగలలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల పనివారు కూడా.. ఇప్పుడు బిజీ అయిపోయారు.
బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తీసుకునే నిర్ణయాలతో రియల్ బూమ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి వారంలోనే ఇసుక విధానంపై సమీక్షించనున్నారు. దీంతో ఈ హడావుడి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అలానే కొనుగోలు దారులు కూడా.. గతంలో హైదరాబాద్ వైపు చూడగా ఇప్పుడు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనేకొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ బూమ్ ఊహించని విధంగా జోరు అందుకోవడం గమనార్హం.
This post was last modified on June 11, 2024 7:39 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…