ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి.. మీడియా సామ్రాజ్యాన్ని నాలుగు దశాబ్దాలకు పైగా శాసిస్తున్న రామోజీ రావు… భౌతికంగా వెడలిపోయారు. ఆయన వదిలి వెళ్లిన.. అనేక నిబద్ధతలు.. పాత్రికేయ ప్రపంచాన్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంటాయనడంలో సందేహం లేదు. అయితే.. రామోజీ గురించి చెప్పుకొనే విషయాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబందించి రెండు కీలక విషయాలు చాలా మందికి తెలియదు.
అవే.. రామోజీ పేరు, ఆయన ఇంటి పేరు వ్యవహారాలు. ఈ రెండు కూడా.. ఆయన మార్చుకున్న విషయం చాలా మంది తెలియదు. విద్యార్ధి దశ నుంచే ఉద్యమాలతో ప్రారంభమైన.. రామోజీ ప్రస్థానం.. పత్రిక స్థాపన వరకు.. కమ్యూనిస్టులతోనే ముందుకు సాగింది. ముఖ్యంగా.. పుచ్చల పల్లి సుందరయ్య.. మోటూరి హనుమంతరావు సహా అనేక మంది దిగ్గజకామ్రెడ్లతో కలిసి.. రామోజీ నడిచారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు.. ఆయన చాలా ప్రభావితమయ్యారు.
ఈ క్రమంలోనే దేవుడిని పక్కన పెట్టారు రామోజీ. ఆయనకు విశ్వాసం ఉంది.. అంతే! ఇంతకు మించి అంటే… ఏమీ లేదు. ఆయన ఏ గుడికీ వెళ్లరు. ఏ కొండకూ మొక్కరు. దీనికి కారణం.. కమ్యూనిస్టు హేతు వాదం. ఇక, పేరును కూడా.. ఆయన మార్చుకున్నారు. పుచ్చల పల్లి సుందరరామిరెడ్డిగా ఉన్న పేరును సుందరయ్యగా మార్చుకున్న సమయంలోనే.. చెరుకూరి రామయ్యగా ఉన్న పేరును రామోజీగా మార్పు చేసుకున్నారు. హైదరాబాద్ నిజాంల పాలనపైనా.. సాయుధ రైతాంగ పోరాటాలపైనా.. కమ్యూనిస్టులతో కలిసి పోరాడారు.
ఇక, ఇంటి పేరు విషయంలోనూ ఆయన మార్పు చేసుకున్నారు. ఆయనకు అసలు ఇంటి పేరే లేదంటే అతిశయోక్తి కాదు.. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన ప్రభుత్వ ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. తనకు ఇంటి పేరు అవసరం లేదని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని గెజిట్ విడుదల చేయించుకున్నారు. అందుకే.. ఆయన ఎక్కడ సంతకం చేయాల్సి వచ్చినా.. ఇంటి పేరు ఉండదు. కేవలం రామోజీరావు అనే ఉంటుంది. ఇదంతా.. కమ్యూనిస్టుల నుంచి వచ్చిన హేతువాద దృక్ఫథమేనని ఆనాటి ఆయన సహచరులు చెబుతారు.
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…