వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం రెడీ అయింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు బుధవారంతో తీరిపోతుంది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లికి సంబంధించిన కేసులను గురువారం హైకోర్టు మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు, ఆదేశాలు కూడా ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఏం జరిగింది?
గత నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు బూత్లో ఈవీఎం, వీవీ ప్యాట్ను ధ్వంసం చేయడం, దీనిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేయడం.. చివరకు హత్యాయత్నం చేయడం.. వంటివి పిన్నెల్లి ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు సీఐ నారాయణ స్వామి పైనా హత్యాయత్న జరిగిందని.. దీనికి కారణం కూడా.. పిన్నెల్లేనని పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఏర్పాటైన సిట్ పలు నివేదికలు కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో పరారైన పిన్నెల్లి.. తనను పోలీసులు అరెస్టు చేయకుండా వెళ్లిపోయారు. ఇంతోలోనే మరోవైపు.. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఎన్నికల కౌంటింగ్ ఉందని.. తాను ఎన్నికల కౌంటింగ్ సమయంలో పాల్గొనకపోతే.. నష్టపోయే అవకాశం ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అనంతరం.ఆయన బయటకు వచ్చారు. అయితే.. కొన్ని షరతులకు లోబడి.. ఆయన వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది.
మాచర్లకు వెళ్లరాదని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని.. మీడియాతోనూ మాట్లాడకూడదని పేర్కొంది. అయితే.. కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లొచ్చని హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఈ ముందస్తు బెయిల్ జూన్ 5వ తేదీ వరకు వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. అయితే.. దీనిని.. టీడీపీ నాయకుడు శేషగిరిరావు.. సుప్రీంకోర్టులో సవాల్చేశారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం తీర్పని.. హైకోర్టు పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. జూన్ 6న జరిగే విచారణలో ఖచ్చితంగా దీనిని పరిష్కరించాలని ఆదేశించింది. దీంతో పిన్నెల్లికి కోర్టు కష్టాలు మామూలుగా లేవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 5, 2024 5:34 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…