వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం రెడీ అయింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు బుధవారంతో తీరిపోతుంది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లికి సంబంధించిన కేసులను గురువారం హైకోర్టు మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు, ఆదేశాలు కూడా ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఏం జరిగింది?
గత నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు బూత్లో ఈవీఎం, వీవీ ప్యాట్ను ధ్వంసం చేయడం, దీనిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేయడం.. చివరకు హత్యాయత్నం చేయడం.. వంటివి పిన్నెల్లి ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు సీఐ నారాయణ స్వామి పైనా హత్యాయత్న జరిగిందని.. దీనికి కారణం కూడా.. పిన్నెల్లేనని పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఏర్పాటైన సిట్ పలు నివేదికలు కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో పరారైన పిన్నెల్లి.. తనను పోలీసులు అరెస్టు చేయకుండా వెళ్లిపోయారు. ఇంతోలోనే మరోవైపు.. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఎన్నికల కౌంటింగ్ ఉందని.. తాను ఎన్నికల కౌంటింగ్ సమయంలో పాల్గొనకపోతే.. నష్టపోయే అవకాశం ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అనంతరం.ఆయన బయటకు వచ్చారు. అయితే.. కొన్ని షరతులకు లోబడి.. ఆయన వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది.
మాచర్లకు వెళ్లరాదని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని.. మీడియాతోనూ మాట్లాడకూడదని పేర్కొంది. అయితే.. కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లొచ్చని హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఈ ముందస్తు బెయిల్ జూన్ 5వ తేదీ వరకు వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. అయితే.. దీనిని.. టీడీపీ నాయకుడు శేషగిరిరావు.. సుప్రీంకోర్టులో సవాల్చేశారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం తీర్పని.. హైకోర్టు పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. జూన్ 6న జరిగే విచారణలో ఖచ్చితంగా దీనిని పరిష్కరించాలని ఆదేశించింది. దీంతో పిన్నెల్లికి కోర్టు కష్టాలు మామూలుగా లేవని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…