ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా అధికార వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
ఏపీలో చంద్రబాబు గెలవడంపై ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించాయి. ఈ వేడుకలకు అనూహ్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ఆయా పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ఆఫీసులోకి వెళ్లిన మంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రికి తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇద్దరూ ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం నేతలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి టీడీపీ సంబరాలకు హాజరవడా విశేషం.
This post was last modified on June 5, 2024 4:30 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…