ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా అధికార వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
ఏపీలో చంద్రబాబు గెలవడంపై ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించాయి. ఈ వేడుకలకు అనూహ్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ఆయా పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ఆఫీసులోకి వెళ్లిన మంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రికి తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇద్దరూ ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం నేతలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి టీడీపీ సంబరాలకు హాజరవడా విశేషం.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…