Political News

చైనాకి ఆ నలుగురి షాక్… భారత్ బలం పెరుగుతోంది

డ్రాగన్ దేశం దురాగతాలను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాలు ఏకం అవుతున్నాయి. కొద్ది నెలలుగా భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యాలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అందరు చూస్తున్నదే. మొదట లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ తర్వాత ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలోను దుస్సాహసానికి పాల్పడుతోంది. చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేసినపుడల్లా మన సైన్యాలు ధీటుగా సమాధానం చెబుతున్న కారణంగా డ్రాగన్ పన్నాగాలు ముందుకు సాగటం లేదు. లేకపోతే మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసి చాలా కంపు చేసేదనటంలో సందేహం లేదు.

ప్రత్యక్షంగా మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా అగ్రరాజ్యం అమెరికా, పొరుగునే ఉన్న జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడా ఏదో విధమైన జగడాలకు దిగుతోంది. అవసరం లేకపోయినా పై దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ఏదో రూపంలో గొడవలకు రెచ్చగొడుతోంది. దాంతో ఒళ్ళు మండిపోయిన పై దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని డిసైడ్ అయ్యాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కీలక నేతలు భారత్ లో సమావేశమవ్వాలని నిర్ణయించాయి. అయితే హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా జపాన్ దేశం నుండి ఎవరు రావటం లేదు.

అలాగే ఆస్ట్రేలియా నుండి కూడా ప్రస్తుతానికి ఎవరు రావటం లేదు. అందుకనే అమెరికా విదేశాంగ శాఖమంత్రి మైక్ పాంపియో తొందరలోనే మనదేశానికి వస్తున్నారు. ముందుగా వీళ్ళద్దరు సమావేశం అయి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. తర్వాత అందరికీ అనువైన తేదీలో నాలుగు దేశాల కీలక నేతలు సమావేశవ్వనున్నారు. డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు నాలుగు దేశాల సైన్యాలు ఒకటిగా ఉండాలని నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ వెంబడే చైనా సైన్యం ప్రయత్నిస్తున్న చొరబాట్లు, మనసైన్యంపై దాడులు చేయటం, ఇండో-పసిఫిక్, దక్షిణ చైన సముద్ర జలల్లో డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరి తదితరాలు ప్రధాన అజెండాగా ఉండబోతున్నాయి.

ఈ నాలుగు దేశాల మధ్య రక్షణపరమైన సహకారమే కాకుండా మిలిటరీ హార్డ్ వేర్ పరికరాలు ఇచ్చి పుచ్చుకోవటం, ప్రపంచ వాణిజ్య రంగంలో కూడా చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నాయి. మొత్తానికి ప్రపంచంలో రోగ్ నేషన్ గా ప్రచారంలో ఉన్న చైనాకు వ్యతిరేకంగా చాలా దేశాలు తొందరలో ఏకం కానున్నాయి. అసలే ప్రపంచదేశాలను కరోనా వైరస్ కబళించటానికి చైనానే కారణమని చాలా దేశాలు మండిపోతున్నాయి. దానికి అదనంగా చైనా వైఖరి కూడా తోడై మండిపోతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికైతే నాలుగు దేశాలు ఏకమయ్యాయి. ముందు ముందు ఇంకెన్ని దేశాలు మనదేశంతో చేతులు కలుపుతాయో చూడాల్సిందే.

This post was last modified on September 20, 2020 1:32 am

Share
Show comments
Published by
suman

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago