Political News

కౌర‌వ స‌భ ముగిసింది.. బాబు శ‌ప‌థం నెర‌వేరింది!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాను చేసిన శ‌ప‌థాన్ని నిరూపించుకున్నారు. కౌర‌వ స‌భ‌లో ఉండ‌ను.. గౌర‌వ స‌భ ఏర్పాటైన త‌ర్వాత‌.. సీఎంగానే స‌భ‌లో అడుగు పెడ‌తానంటూ.. 2022లో ఆయ‌న చేసిన శ‌ప‌థం.. అందునా నిండు స‌భ‌లో చేసిన శ‌ప‌థం.. ఇప్పుడు నిజ‌మైంది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అంతేకాదు… ఏక‌ప‌క్ష విజ‌యం ద‌క్కించుకుంది. పోటీ చేసిన 144 స్థానాల్లోనూ 135 స్థానా ల్లో విజ‌యం సాధించే దిశ‌గా దూసుకుపోయేందుకు టీడీపీ వ‌డివ‌డిగా ముందుకు అడుగులు ప‌డుతు న్నాయి.

ఇదిగ‌మ‌నిస్తే.. టీడీపీ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. ఆ నాడు 2022లో వైసీపీలోకి జంప్‌చేసిన గ‌న్న‌వ‌రం అప్ప‌టి ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ నారా లోకేష్‌, నారా భువ‌నేశ్వ‌రి కేంద్రంగా చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీ వ‌ర‌కు పాకాయి. దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారుస‌భ‌లో నిప్పులు చెరిగారు. “ఇది కౌర‌వ స‌భ‌. మ‌ళ్లీ గౌర‌వ స‌భ ఏర్పాట‌య్యే వ‌ర‌కు.. నేను సీఎంగా గెలిచే వ‌ర‌కు స‌భ‌లో అడుగు పెట్ట‌ను” అని శ‌ప‌థం చేసి.. దండం పెట్టి మ‌రీ బ‌య‌ట‌కువ‌చ్చారు.

ఆనాడే టీడీపీ నేత‌లు.. వైసీపీ ప‌తనం ప్రారంభ‌మైంద‌ని.. స‌భ‌లో వ్యాఖ్య‌లు చేశారు. ఇది ఇప్పుడు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు నిజ‌మైంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. లండ‌న్ వెళ్తూ.. ఆశ్చ‌ర్య క‌ర‌మైన పోలింగ్ జ‌రిగింద‌న‌.. దేశం మొత్తం ఏపీవైపు చూసే ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. అచ్చం ఆయ‌న ఏ యాంగిల్‌లో చెప్పారో తెలియ‌దు కానీ.. ఇప్పుడు దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ప్ర‌జా తీర్పు ఏక‌ప‌క్షంగా సాగిపోయింది. మ‌హిళ‌లు రాత్రి 9 గంట‌ల వ‌రకు క్యూలైన్ల‌లో వేచి ఉండిమ‌రీ ఓటేశారు. ప‌లితంగా కౌర‌వ స‌భ పోయి.. గౌర‌వ స‌భ ఏర్ప‌డి.. చంద్ర‌బాబు త‌న శ‌ప‌థాన్ని నిరూపించుకున్నారు.

This post was last modified on June 4, 2024 1:09 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

11 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

58 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago