రాజకీయాలలో ఏదీ ఎవరికీ శాశ్వతం కాదు. ఒకరిని వెక్కిరించినంత సమయం పట్టదు.. వెక్కిరించిన వారు .. సైతం.. ఆ పరిస్థితి చేరుకునేందుకు. 2019 ఎన్నికల తర్వాత.. పదే పదే వైసీపీ.. టీడీపీని వెక్కించింది. ఎందుకంటే.. వైసీపీ 151 సీట్లు అప్పట్లో దక్కించుకుంది. ఇదేసమయంలో టీడీపీ 23 సీట్లు మాత్రమే ద క్కించుకుంది.దీంతో అన్ని కోణాల్లోనూ.. వైసీపీ .. టీడీపీని తీవ్రస్థాయిలో ఏకేసింది. 23 సీట్లే దక్కించుకు న్నారని వ్యాఖ్యానించారు.
అలాంటి వైసీపీకి ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇదే ఫలితం వస్తుందా? అనేది సందేహంగా మారిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న కౌంటింగ్ ట్రెండ్ను పరిశీలిస్తే.. వైసీపీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. మహా అయితే.. మరొక్క సీటు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.. మంగళవారం ఉదయం నుంచి వచ్చిన కౌంటింగ్ ట్రెండ్ను పరిశీలిస్తే.. ఏకపక్షంగా ప్రజలు ఓటేశారు. అంతేకాదు.. వైసీపీకి గుండుగుత్తగా వ్యతిరేకించారు.
ఫలితంగా 2019లో వచ్చిన టీడీపీ 23 స్థానాలను కూడా వైసీపీ దక్కించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. ఇది నిజానికి.. టీడీపీ రికార్డును బ్రేక్ చేసినట్టే అవుతుంది. కనీసం 23 స్థానాలు కూడా.. దక్కక పోవడం అంటే.. ఇదే కదా! అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు వైసీపీ ఏం చెబుతుంది? ఏం చేస్తుంది? అనేది పక్కన పెడితే.. వైసీపీకి ప్రజలు బలమైన షాక్ ఇచ్చారనే చెప్పాలి. సంక్షేమం కన్నా.. రాజధాని, అభివృద్ధి దిశగానే ప్రజలు అడుగులు ముందుకు వేశారని అంటున్నారు.
This post was last modified on June 4, 2024 12:40 pm
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు.…
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యవ్వనంలో అమ్మాయిల కోసం…
అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు…
ఉద్యోగం అంటే సాధారణంగా డిగ్రీలు, అనుభవం, స్కిల్స్ ఇలా అనేక అర్హతలు అవసరమవుతాయి. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్…
సంక్రాంతి సినిమాల సందడి ముగింపు దశకు వచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టి ‘తండేల్’ మీదికి మళ్లబోతోంది. ఈ సినిమా…
అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా…