రాజకీయాలలో ఏదీ ఎవరికీ శాశ్వతం కాదు. ఒకరిని వెక్కిరించినంత సమయం పట్టదు.. వెక్కిరించిన వారు .. సైతం.. ఆ పరిస్థితి చేరుకునేందుకు. 2019 ఎన్నికల తర్వాత.. పదే పదే వైసీపీ.. టీడీపీని వెక్కించింది. ఎందుకంటే.. వైసీపీ 151 సీట్లు అప్పట్లో దక్కించుకుంది. ఇదేసమయంలో టీడీపీ 23 సీట్లు మాత్రమే ద క్కించుకుంది.దీంతో అన్ని కోణాల్లోనూ.. వైసీపీ .. టీడీపీని తీవ్రస్థాయిలో ఏకేసింది. 23 సీట్లే దక్కించుకు న్నారని వ్యాఖ్యానించారు.
అలాంటి వైసీపీకి ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇదే ఫలితం వస్తుందా? అనేది సందేహంగా మారిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న కౌంటింగ్ ట్రెండ్ను పరిశీలిస్తే.. వైసీపీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. మహా అయితే.. మరొక్క సీటు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.. మంగళవారం ఉదయం నుంచి వచ్చిన కౌంటింగ్ ట్రెండ్ను పరిశీలిస్తే.. ఏకపక్షంగా ప్రజలు ఓటేశారు. అంతేకాదు.. వైసీపీకి గుండుగుత్తగా వ్యతిరేకించారు.
ఫలితంగా 2019లో వచ్చిన టీడీపీ 23 స్థానాలను కూడా వైసీపీ దక్కించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. ఇది నిజానికి.. టీడీపీ రికార్డును బ్రేక్ చేసినట్టే అవుతుంది. కనీసం 23 స్థానాలు కూడా.. దక్కక పోవడం అంటే.. ఇదే కదా! అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు వైసీపీ ఏం చెబుతుంది? ఏం చేస్తుంది? అనేది పక్కన పెడితే.. వైసీపీకి ప్రజలు బలమైన షాక్ ఇచ్చారనే చెప్పాలి. సంక్షేమం కన్నా.. రాజధాని, అభివృద్ధి దిశగానే ప్రజలు అడుగులు ముందుకు వేశారని అంటున్నారు.
This post was last modified on June 4, 2024 12:40 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…