2024 ఎన్నికల్లో గెలుస్తామా? గెలవలేమా? అన్న స్థాయి నుంచి కనీవినీ ఎరుగని విజయం దిశగా టీడీపీ దూసుకుపోతోంది. గత 2014, 2019 ఎన్నికలతోపోల్చుకుంటే.. 2024 ఎన్నికలు టీడీపీకి ఒక కొత్త చరిత్రను అందించాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కేవలం 102 స్థానాలకే పరిమితం అయింది. ఇవి ఒంటరిగా తెచ్చుకున్న సీట్లు. ఇక, 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఒంటరిగానే పోటీలో నిలిచింది. ఫలితంగా 23 స్థానాలకే పరిమితం అయింది. వీరిలోనూ నలుగురు జంప్ అయిపోయారు.
దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ వచ్చిన నాటి నుంచి టీడీపీ అనేక ఇబ్బందులు పడిందనే విషయంలో సందేహం లేదు. ఒకానొక సందర్భంలో ప్రధాన ప్రతిపక్షం కూడా.. దక్కే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపించింది. ఇక, కేసుల నమోదు.. నాయకులను అరెస్టు చేయడం జైళ్లలో పెట్టడం తో న్యాయ పోరాటాలు నిత్యంకృత్యం అయ్యాయి. మరీముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును కూడా జైల్లో పెట్టడం వంటివి పార్టీని ఇబ్బందుల్లో కి నెట్టాయి.
దీంతో అసలు పార్టీ ఉంటుందా? ఉండదా? అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. కానీ, ప్రస్తుతం వస్తున్న ట్రెండ్లో మాత్రం టీడీపీ ఒంటరిగానే మేజిక్ ఫిగర్ దాటిపోయింది. ప్రస్తుతం పొత్తు పెట్టుకున్న టీడీపీ 175 నియోజకవర్గాల్లో 144 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. అయితే.. 129 స్థానాల్లో టీడీపీ ఒంటరిగానే విజయం దక్కించుకునేలా ముందుకు సాగుతోంది.
ఇప్పటికే 100 స్థానాల్లో దాదాపు టీడీపీ ఒంటరి విజయం ఖాయమైంది. దీంతో మొత్తం 129 స్థానాల్లోటీడీపీ కనుక విజయం దక్కించుకుంటే.. ఇది కనీ వినీ ఎరుగని విజయంగానే భావించాలి.అంతేకాదు.. చంద్రబాబు పార్టీ అధినేత అయిన తర్వాత.. దక్కిన అద్భుత విజయంగానే దీనిని భావించాలి.
This post was last modified on June 4, 2024 12:33 pm
హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ పాత్ర జెన్ జీలో పుట్టుకొచ్చింది కాదు. 90 దశకం కార్టూన్ రూపంలో టీవీలో…
దేశ విదేశాల్లో అతి తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న సీజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కు డిమాండ్ పెరిగింది. రాజకీయంగానే…
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ఎక్కువ సినిమాలు హీరోయిన్ గా చేసినవాళ్లలో జయప్రద ముఖ్యులు. అప్పట్లో ఈ కలయికలో ఎన్నో…
తెలంగాణాలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాకపోవడంతో ఏమి చేయాలో…
స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వసాధారణం. దక్షిణాదిలో అత్యధిక శాతం దీన్ని కొడుకులకే పరిమితం చేస్తూ ఉంటారు.…
అధికారంలో ఉండగా తమదైన బెదిరింపులకు పాల్పడిన వైపీపీ... అదికారం కోల్పోయాక మరింత దిగజారుడు తనాన్ని బయటపెట్టుకుంటోంది. మహిళలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతున్న వైసీపీ…