ఏపీలో వస్తున్న ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. ప్రజలు ఏకపక్షంగానే తీర్పు ఇచ్చారని తెలుస్తోం ది. ముఖ్యంగా సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో “మీకుటుంబానికి మంచి జరిగిందని అనుకుంటేనే మాకు ఓటు వేయండి” అని పిలుపునిచ్చారు ఇప్పుడు వస్తున్న ట్రెండును పరిశీలిస్తే.. జనాలు ఈ దిశగా నే ఓటు వేశారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే.. ఇక్కడ కూడా..వైసీపీకి బెడిసి కొట్టింది.
లక్షల కోట్ల రూపాయలను డీబీటీవిధానంలో ప్రజలకు పంపిణీ చేశామని.. రాష్ట్రంలోనేకాదు.. దేశంలో కూ డా ఏ ప్రభుత్వం కూడా.. ఇలా పంపిణీ చేయలేదని.. నాడు నేడు ద్వారా ఇళ్లు ఇచ్చామని.. పాఠశాలలను అభివృద్ధి చేశామని.. జగన్ చెప్పుకొచ్చారు. కానీ. దీనివైపు ప్రజలు నడిపించలేక పోయారనేది స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. అసలు మంత్రుల విషయంలోనూ జగన్ ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేశామని చెప్పారు. వారికి పదవులు ఇచ్చామన్నారు.
కానీ, కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే.. ఎక్కడా కూడా.. వైసీపీకి ఆశించిన ఫలితం మాత్రం ఎక్కడా దక్కలేదు. మరి ఇంత చేసిన జగన్ ఎవరినీ సంతృప్తి పరచలేక పోయారనే వాదన వినిపిస్తోంది. నిజానికి కులం చూడం మతం చూడం.. పార్టీలు కూడా చూడబోమని చెప్పిన జగన్ మాటలు ఎక్కడా ఫలించలేదు. దీంతో 2019 లో వచ్చిన విజయం కన్నా ఘోరంగా ఇప్పుడు వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుండడం గమనార్హం. మరి దీనిని బట్టి.. సంతృప్తి లేని సంక్షేమంగానే వైసీపీ సర్కారు నిలిచి పోయిందని చెప్పాలి.
This post was last modified on June 4, 2024 12:26 pm
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…
గత నెల విడుదలై భారీ విజయం అందుకున్న ఆయ్ థియేట్రికల్ గా మంచి రెవిన్యూ సాధించింది. అయితే బిగ్ స్క్రీన్…
రాజకీయాలన్నాక పదవులు.. హోదాలు ఆశించడం తప్పుకాదు. అసలు రాజకీయాల్లోకి వచ్చేదే పెత్తనం కోసం. దీనిని కాదన్న వారు రాజకీయ నేతలే…
న్యాచురల్ స్టార్ నాని తాజా బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం దిగ్విజయంగా వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టేసింది. దసరా…
ఒక మహిళ కేసు.. దానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ లు.. అందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు. వారందరిని సస్పెన్షన్…