Political News

సంతృప్తిలేని.. జ‌గ‌న్ సంక్షేమం..

ఏపీలో వ‌స్తున్న ఎన్నిక‌ల కౌంటింగ్ ట్రెండ్స్ ప‌రిశీలిస్తే.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు ఇచ్చార‌ని తెలుస్తోం ది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో “మీకుటుంబానికి మంచి జ‌రిగిందని అనుకుంటేనే మాకు ఓటు వేయండి” అని పిలుపునిచ్చారు ఇప్పుడు వ‌స్తున్న ట్రెండును ప‌రిశీలిస్తే.. జ‌నాలు ఈ దిశ‌గా నే ఓటు వేశార‌ని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌పై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. ఇక్క‌డ కూడా..వైసీపీకి బెడిసి కొట్టింది.

ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను డీబీటీవిధానంలో ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేశామ‌ని.. రాష్ట్రంలోనేకాదు.. దేశంలో కూ డా ఏ ప్ర‌భుత్వం కూడా.. ఇలా పంపిణీ చేయ‌లేద‌ని.. నాడు నేడు ద్వారా ఇళ్లు ఇచ్చామ‌ని.. పాఠ‌శాలల‌ను అభివృద్ధి చేశామ‌ని.. జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. కానీ. దీనివైపు ప్ర‌జ‌లు న‌డిపించ‌లేక పోయార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. అస‌లు మంత్రుల విష‌యంలోనూ జ‌గ‌న్ ఎక్కువ‌గా ప్ర‌చారం చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు మేలు చేశామ‌ని చెప్పారు. వారికి ప‌ద‌వులు ఇచ్చామ‌న్నారు.

కానీ, కౌంటింగ్ జ‌రుగుతున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఎక్క‌డా కూడా.. వైసీపీకి ఆశించిన ఫ‌లితం మాత్రం ఎక్క‌డా ద‌క్క‌లేదు. మ‌రి ఇంత చేసిన జ‌గ‌న్ ఎవ‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌లేక పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి కులం చూడం మ‌తం చూడం.. పార్టీలు కూడా చూడ‌బోమ‌ని చెప్పిన జ‌గ‌న్ మాటలు ఎక్క‌డా ఫ‌లించ‌లేదు. దీంతో 2019 లో వ‌చ్చిన విజ‌యం క‌న్నా ఘోరంగా ఇప్పుడు వైసీపీ ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని బ‌ట్టి.. సంతృప్తి లేని సంక్షేమంగానే వైసీపీ స‌ర్కారు నిలిచి పోయింద‌ని చెప్పాలి.

This post was last modified on June 4, 2024 12:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

10 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

41 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago