ఏపీలో జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియలో తొలి మూడు రౌండ్లు ముగిసేనాటికి అద్భుతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అధికారంలోకి వచ్చేందుకు అసవరమైన.. మేజిక్ ఫిగర్ 88 స్థానాలు. వీటిలో తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి 96 స్థానాల్లో కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. వీటిలో టీడీపీ ఒంటరిగా 81 స్థానాల్లోనూ.. జనసేన 11, బీజేపీ 5 స్థానాల్లోనూ దూకుడుగా ఉన్నాయి.
దీంతో కూటమి మేజిక్ ఫిగర్ దాటేసింది. అయితే.. ప్రస్తుతం జరిగిన 3 రౌండ్లలో నే ఫలితం వెల్లడైంది. అదేసమయంలో మరో 12 రౌండ్ల వరకు కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఐదు రౌండ్లు అయ్యే సరికి ఒక నిర్ణయం తెలుస్తుంది. కానీ, మారే విషయానికి వస్తే.. చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సీమలో వైసీపీ వెనుక బడిపోయింది. దీంతో కూటమి దూకుడు కనిపిస్తోంది.
ఇక, ఓటింగ్ శాతం విషయానికి వస్తే.. టీడీపీ కూటమికి 51.26 శాతం ఓట్ల శాతం కనిపిస్తోంది. వైసీపీకి 41 శాతం ఓటింగ్ కనిపిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి 10 శాతానికి పైగా ఓట్ల తేడా కనిపిస్తోంది. అదేవిధంగా కీలకమైన… సీమ ప్రాంతంలో వైసీపీ దూకుడు ప్రదర్శించలేక పోతోంది. మరోవైపు కూటమి పార్టీలు సీమలోనూ దూసుకుపోతున్నాయి. ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఈ పరిణామాలు గమనిస్తే… కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉండడం గమనార్హం.
This post was last modified on June 4, 2024 9:57 am
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…