Political News

షేకింగ్ : మేజిక్ ఫిగ‌ర్ చేరుకున్న టీడీపీ కూట‌మి!

ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఓటింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియలో తొలి మూడు రౌండ్లు ముగిసేనాటికి అద్భుతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు అస‌వ‌రమైన‌.. మేజిక్ ఫిగ‌ర్ 88 స్థానాలు. వీటిలో తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి 96 స్థానాల్లో కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వీటిలో టీడీపీ ఒంటరిగా 81 స్థానాల్లోనూ.. జ‌న‌సేన 11, బీజేపీ 5 స్థానాల్లోనూ దూకుడుగా ఉన్నాయి.

దీంతో కూట‌మి మేజిక్ ఫిగ‌ర్ దాటేసింది. అయితే.. ప్ర‌స్తుతం జ‌రిగిన 3 రౌండ్ల‌లో నే ఫ‌లితం వెల్ల‌డైంది. అదేస‌మయంలో మ‌రో 12 రౌండ్ల వ‌ర‌కు కౌంటింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఐదు రౌండ్లు అయ్యే స‌రికి ఒక నిర్ణ‌యం తెలుస్తుంది. కానీ, మారే విష‌యానికి వ‌స్తే.. చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా సీమ‌లో వైసీపీ వెనుక బ‌డిపోయింది. దీంతో కూట‌మి దూకుడు క‌నిపిస్తోంది.

ఇక‌, ఓటింగ్ శాతం విష‌యానికి వ‌స్తే.. టీడీపీ కూట‌మికి 51.26 శాతం ఓట్ల శాతం క‌నిపిస్తోంది. వైసీపీకి 41 శాతం ఓటింగ్ క‌నిపిస్తోంది. మూడు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి 10 శాతానికి పైగా ఓట్ల తేడా క‌నిపిస్తోంది. అదేవిధంగా కీల‌క‌మైన‌… సీమ ప్రాంతంలో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతోంది. మ‌రోవైపు కూట‌మి పార్టీలు సీమ‌లోనూ దూసుకుపోతున్నాయి. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూట‌మి పార్టీలు ముందంజ‌లో ఉన్నాయి. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే… కూట‌మి అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌రమైన అన్ని స్థానాల్లోనూ ముందంజ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

23 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago