Political News

షేకింగ్ : మేజిక్ ఫిగ‌ర్ చేరుకున్న టీడీపీ కూట‌మి!

ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఓటింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియలో తొలి మూడు రౌండ్లు ముగిసేనాటికి అద్భుతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు అస‌వ‌రమైన‌.. మేజిక్ ఫిగ‌ర్ 88 స్థానాలు. వీటిలో తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి 96 స్థానాల్లో కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వీటిలో టీడీపీ ఒంటరిగా 81 స్థానాల్లోనూ.. జ‌న‌సేన 11, బీజేపీ 5 స్థానాల్లోనూ దూకుడుగా ఉన్నాయి.

దీంతో కూట‌మి మేజిక్ ఫిగ‌ర్ దాటేసింది. అయితే.. ప్ర‌స్తుతం జ‌రిగిన 3 రౌండ్ల‌లో నే ఫ‌లితం వెల్ల‌డైంది. అదేస‌మయంలో మ‌రో 12 రౌండ్ల వ‌ర‌కు కౌంటింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఐదు రౌండ్లు అయ్యే స‌రికి ఒక నిర్ణ‌యం తెలుస్తుంది. కానీ, మారే విష‌యానికి వ‌స్తే.. చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా సీమ‌లో వైసీపీ వెనుక బ‌డిపోయింది. దీంతో కూట‌మి దూకుడు క‌నిపిస్తోంది.

ఇక‌, ఓటింగ్ శాతం విష‌యానికి వ‌స్తే.. టీడీపీ కూట‌మికి 51.26 శాతం ఓట్ల శాతం క‌నిపిస్తోంది. వైసీపీకి 41 శాతం ఓటింగ్ క‌నిపిస్తోంది. మూడు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి 10 శాతానికి పైగా ఓట్ల తేడా క‌నిపిస్తోంది. అదేవిధంగా కీల‌క‌మైన‌… సీమ ప్రాంతంలో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతోంది. మ‌రోవైపు కూట‌మి పార్టీలు సీమ‌లోనూ దూసుకుపోతున్నాయి. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూట‌మి పార్టీలు ముందంజ‌లో ఉన్నాయి. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే… కూట‌మి అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌రమైన అన్ని స్థానాల్లోనూ ముందంజ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

27 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

1 hour ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

4 hours ago