ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ధర్మవరం. ఇక్కడ రాజకీయంగా కొత్త రగడ తెరమీదికి వచ్చింది. తాజాగాజరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించిన పరిటాల వారసుడు శ్రీరాంకు టికెట్ దక్కలేదు. ఇదే సమయంలో ఆయన వ్యతిరేకించిన గోనుగుండ్ల సూర్య నారాయణ, ఉరఫ్ వరదా పురం సూరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎటొచ్చీ.. కూటమిలో భాగంగా బీజేపీకి ఈటికెట్ ఇచ్చారు.
బీజేపీ నుంచి బలమైన నాయకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ పోటీచేశారు. ఈయనకు టీడీపీ నాయకులు కూడా సహకరించారు. ముఖ్యంగా పరిటాల శ్రీరాం అన్నీ తానై.. ఇక్కడ ప్రచారం చేశారు. యువతను కూడా సమీకరించారు. వైసీపీని ఓడించాలని గట్టిగానే శ్రీరాం ప్రయత్నించారు. అంతా బాగానే జరిగిపోయిందని అనుకున్నారు. కానీ, ఎన్నికల పోలింగ్ రోజు.. దీనికి ముందు రోజు రాత్రి జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.
వైసీపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. టీడీపీ యువతను తనవైపు తిప్పుకొన్నారనే ప్రచారం తెరమీదికి వచ్చింది. వారిని నయానో.. భయానో.. తమవైపు తిప్పుకోవడంతో టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి.. వైసీపీకి మేలు జరిగిందనే లెక్కలు తెరమీదికి వస్తున్నాయి. ఇది సత్యకుమార్ను డోలాయమానంలో పడేసింది. ఇదంతా కావాలని చేశారంటూ.. సత్యకుమార్ వర్గం ఆందోళనకు దిగడంతో విషయం వెలుగు చూసింది.
అయితే.. శ్రీరాం వర్గం మాత్రం తాము నిఖార్సుగానే పనిచేశామని.. ఎక్కడా పొరపాట్లు జరగలేదని చెబు తుండడం గమనార్హం. కానీ, క్షేత్రస్తాయిలో మాత్రం వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పరి ణామాలతో ధర్మవరంలో క్రాస్ ఓటింగ్పై సందేహాలు తలెత్తుతున్నాయి. అదీగాక.. మరో సందేహం కూడా తెరమీదికి వస్తోంది. వరదాపురం సూరి ఉద్దేశ పూర్వకంగా సత్యకుమార్కు చెక్ పెట్టేలా వ్యవహరించి.. ఈ పనిచేశారనే చర్చ కూడా జరుగుతోంది.
This post was last modified on May 30, 2024 6:53 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…