ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రస్తుత ఎన్నికల్లో ఈక్వేషన్ల మంత్రం పఠించింది. స్థానికంగా ఉన్న వారిని.. సిట్టింగులను కూడా ఎన్నికల సమయంలో మార్పు చేసింది. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని కూడా.. ఇక్కడ నియమిస్తూ.. తాము ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పుకొంది. అయితే.. అన్ని వేళలా ఈ ప్రయోగాలు ఫలిస్తాయని చెప్పలేని పరిస్థితి. ఇదే.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా నాలుగు కీలక నియోజకవర్గాలను పార్టీ వదులుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
పెనమలూరు… ఇక్కడ బీసీ నేత, మంత్రి జోగి రమేష్కు అవకాశం ఇచ్చారు. కానీ, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతోపాటు.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. దీంతో ఈ సీటు ను దక్కించుకోవడం వైసీపీకి అంత ఈజీకాదని అంటున్నారు. పైగా.. ఇక్కడ పోలింగ్ శాతం 79.12 గా నమోదైంది. ఇది స్థిరమైన ఓటు బ్యాంకు కావడం.. టీడీపీకే అనుకూలంగా పడిందనే చర్చ సాగుతోంది. దీంతో ఇక్కడ టీడీపీనే గెలుపు గుర్రం ఎక్కుతుందని అంటున్నారు.
మైలవరం: ఇక్కడ కూడా.. టీడీపీకి అనుకూల పవనాలు వున్నాయి. వైసీపీ చేసిన బీసీ ప్రయోగం ఇక్కడ కూడా వికటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక సాధారణ నాయకుడిని ఎమ్మెల్యే చేయాలని అనుకున్నా.. ఇక్కడ వైసీపీ వేసిన అడుగులు.. నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడంతో ఆ సెగ బాగా పనిచేసింది.
ఇక, చిలకలూరిపేటలోనూ.. ఇదే తరహా ప్రయోగం చేసింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రిని వేరే చోటకు మార్చిన వైసీపీ.. గుంటూరు నగరానికి చెందిన మేయర్ ను తీసుకువచ్చి.. కావటి మనోహర్ను ఇక్కడ నిలిపింది. ఇది ఈ నియోజకవర్గంలో వైసీపీ నేతలకే నచ్చలేదు. దీంతో చివరి నిముషంలో వారు లోపాయికారీగా టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. దీంతో ఇక్కడ కూడా.. టీడీపీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
అదే విధంగా… వైసీపీ చేసిన మరో ప్రయోగం..తాడికొండ. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ప్రత్తిపాడు నుంచి తెచ్చిన మేకతోటి సుచరితకు జగన్ టికెట్ ఇచ్చారు. కానీ.. ఇది టీడీపీకి అనుకూలంగా మారింది. దీంతో ఇక్కడ కూడా.. పార్టీ ఓటమి పాలయ్యే ఛాన్స్ మెండుగా ఉందనే చర్చ సాగుతోంది. ఓటింగ్ కూడా ఏకపక్షంగానే సాగిందని అంటున్నారు.
This post was last modified on May 29, 2024 11:47 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…