Political News

వీరికి న్యాయం చేయాలి బాబూ..!

టీడీపీ స‌ర్కారు క‌నుక అధికారంలోకి వ‌స్తే.. అంటే.. కూట‌మి గెలిచి.. పార్టీ అధికారంలోకి వ‌స్తే.. మంత్రి ప‌ద‌వుల విష‌యంలో యాగీ ఉండ‌డం ఖాయం. ఎందుకంటే.. 21 స్థానాల్లో పోటీ చేసిన జ‌న‌సేన‌, 10 స్థానాలు తీసుకున్న బీజేపీ కూడా.. జోరుగానే ప్ర‌య‌త్నించింది. హోరుగానే ప్ర‌చారం చేసుకుంది. ఎక్క‌డిక్క‌డ గెలుపు గుర్రాల‌నే పెట్టుకున్నారు. వీరిలో ఎవ‌రినీ త‌క్కువగా అంచ‌నా వేయ‌లేం. అదేస‌మ‌యంలో గెలుస్తారో.. లేదో అన్న అనుమానం ఉన్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన పోటీనే ఇచ్చార‌నేది వాస్త‌వం. దీనికితోడు 144 చోట్ల పోటీలో ఉన్న టీడీపీలోనూ బ‌ల‌మైన నేత‌లే ఉన్నారు.

దీంతో అటు.. మిత్ర‌ప‌క్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి కూడా ప‌ద‌వుల విష‌యంలో చంద్ర‌బాబుకు సెగ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఉన్న‌ది 25 మంది మంత్రుల పోస్టులు. ఇంత‌కు మించి పోస్టులు పెంచుకోవ‌డానికి కూడా అవ‌కాశం లేదు. దీంతో ఆ పాతిక మందిలో ఎంత మందికి న్యాయం చేస్తార‌నేది చ‌ర్చ‌. పైగా.. జ‌న‌సేన త‌ర‌ఫున రెండు, బీజేపి నుంచి రెండు సీట్లు ఆశిస్తున్న‌వారు కూడా ఉన్నారు. నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేష్ వంటివారు.. పోటీలో ఉన్నారు. వీరికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌క త‌ప్పదు. పేర్లు మారినా.. జ‌న‌సేన నుంచి ఇద్ద‌రు ఖ‌చ్చితంగా ఉంటారు.

జ‌న‌సేన నుంచి వినిప‌స్తున్న పేర్ల‌లో బొమ్మిడి నాయ‌క‌ర్ కూడా ఉన్నారు. అలానే కొణ‌తాల రామ‌కృష్ణ గెలుపు గుర్రం ఎక్కితే.. ఉత్త‌రాంధ్ర‌కు ప్రాధాన్యం కింద ఆయ‌న‌కు కూడా ఇవ్వ‌క త‌ప్ప‌ద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, బీజేపీ నుంచి కూడా..ఇద్ద‌రు బ‌లంగా పోటీలో ఉన్నారు. విజ‌య‌వాడ వెస్ట్ నుంచి క‌నుక గెలుపు గుర్రం ఎక్కితే.. సుజ‌నా చౌద‌రికి ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు ప‌క్క‌న సీటు వేస్తారు. అదేవిధంగా మ‌రో కీల‌క నేత కామినేని శ్రీనివాస‌రావు విష‌యంలోనూ.. బీజేపీ ఒత్తిడి ఖాయంగా ఉండ‌నుంది. దీంతో మిత్ర‌ప‌క్షాల‌కు ఎంత లేద‌న్నా.. 5 నుంచి 8 ప‌దవులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌రఫున బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న అచ్చెన్నాయుడు, నారా లోకేష్, గంటా శ్రీనివాస‌రావు, ప‌య్యావు ల కేశ‌వ్‌(గెలిస్తే ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి అంటున్నారు) య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి.. వంటివారు ఆస్థాన మంత్రుల‌నే విష‌యం తెలిసిందే. దీంతో కీల‌కమైన నాయ‌కుల‌కు న్యాయం చేస్తారా? లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇలాంటి వారిలో నిమ్మ‌ల రామానాయుడు, ఏలూరి సాంబ‌శివ‌రావు, గొట్టిపాటి ర‌వి, పొంగూరు నారాయ‌ణ వంటి వారు క‌నిపిస్తున్నారు. ఈ లెక్క ఇంకా ఉంది. మ‌రి వీరికి చంద్ర‌బాబు ఏమేర‌కు న్యాయం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. పార్టీకి ఐదేళ్లు అహ‌ర‌హం వీరు శ్ర‌మించారు. దీంతో వీరికి న్యాయం చేయాల‌ని పార్టీలో వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 28, 2024 7:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

36 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

40 minutes ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

1 hour ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

1 hour ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

1 hour ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

3 hours ago