సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ పాత్ర పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తమకు తెలిసిన, తెలియని అనేక ప్రశ్నలను నెటిజన్లు ఏఐని అడుగుతున్నారు. వీటి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి సమాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్కసారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నలు.. తాజాగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏ ఇద్దరు కలిసినా.. ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.
ఇక, మెలితిరిగిన అనుభవం ఉన్న సెఫాలజిష్టులు కూడా.. దీనికి సమాధానం చెప్పలేక.. వేచి చూడండి అంటూ తప్పించుకుం టున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహిక నెటిజన్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాట్ జీపీటీలైన మాయ ఏఐని ఆశ్రయించారు. ఏపీలో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వంటి కీలక ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో టచ్ చేసి చూడు తరహాలో.. టీడీపీ అధినేత ఎవరు? ఏపీ ప్రస్తుత సీఎం ఎవరు? అనే ప్రశ్నలు కూడా.. సంధించారు. ఈ రెండు ప్రశ్నలకు మాయ ఏఐ.. సరైన సమాధానాలే చెప్పింది.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పింది. అదేవిధంగా ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బదులిచ్చింది. ఇక, ఏపీలో ఎలా ఎన్నికలు జరిగాయి.. అంటే.. రాడికల్గా జరిగాయని.. చెప్పడం విశేషం. అదేసమయంలో ఎక్కడెక్కడ హింస జరిగిందన్న ప్రశ్నకు కూడా సమాధానం సరిగానే చెప్పింది. తాడిపత్రి, పల్నాడు అని పేర్కొంది. ఇక, ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నకు మాత్రం మాయ ఏఐ కూడా దాటవేసింది. ‘దీనికి సమాధానం నాకు తెలీదు. తెలిశాక చెబుతాఅని చెప్పడం గమనార్హం. ఇక, ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారన్న ప్రశ్నకు..ప్రస్తుత సీఎం జగన్ మోహన్రెడ్డి’ అని పదే పదే బదులివ్వడం గమనార్హం. దీంతో ఏఐ కూడా అంచనా వేయలేక పోతోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 27, 2024 9:48 pm
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…