సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ పాత్ర పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తమకు తెలిసిన, తెలియని అనేక ప్రశ్నలను నెటిజన్లు ఏఐని అడుగుతున్నారు. వీటి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి సమాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్కసారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నలు.. తాజాగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏ ఇద్దరు కలిసినా.. ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.
ఇక, మెలితిరిగిన అనుభవం ఉన్న సెఫాలజిష్టులు కూడా.. దీనికి సమాధానం చెప్పలేక.. వేచి చూడండి అంటూ తప్పించుకుం టున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహిక నెటిజన్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాట్ జీపీటీలైన మాయ ఏఐని ఆశ్రయించారు. ఏపీలో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వంటి కీలక ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో టచ్ చేసి చూడు తరహాలో.. టీడీపీ అధినేత ఎవరు? ఏపీ ప్రస్తుత సీఎం ఎవరు? అనే ప్రశ్నలు కూడా.. సంధించారు. ఈ రెండు ప్రశ్నలకు మాయ ఏఐ.. సరైన సమాధానాలే చెప్పింది.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పింది. అదేవిధంగా ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బదులిచ్చింది. ఇక, ఏపీలో ఎలా ఎన్నికలు జరిగాయి.. అంటే.. రాడికల్గా జరిగాయని.. చెప్పడం విశేషం. అదేసమయంలో ఎక్కడెక్కడ హింస జరిగిందన్న ప్రశ్నకు కూడా సమాధానం సరిగానే చెప్పింది. తాడిపత్రి, పల్నాడు అని పేర్కొంది. ఇక, ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నకు మాత్రం మాయ ఏఐ కూడా దాటవేసింది. ‘దీనికి సమాధానం నాకు తెలీదు. తెలిశాక చెబుతాఅని చెప్పడం గమనార్హం. ఇక, ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారన్న ప్రశ్నకు..ప్రస్తుత సీఎం జగన్ మోహన్రెడ్డి’ అని పదే పదే బదులివ్వడం గమనార్హం. దీంతో ఏఐ కూడా అంచనా వేయలేక పోతోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 27, 2024 9:48 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…