Political News

ఏపీలో కూట‌మిదే అధికారం: అమిత్ షా ధీమా

ఏపీలో ఎన్డీయే కూట‌మి(టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆయ‌న పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీలో కూట‌మి బాగా ప‌నిచేసింద‌ని తెలిపారు. రాష్ట్రం అభివృద్దిలో సాగాలంటే.. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌లు బ‌లంగా విశ్వ‌సించార‌ని తెలిపారు. అందుకే రాష్ట్రంలో కూట‌మి వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు. అదేవిదంగా పార్ల‌మెంటు స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు ద‌క్కించుకుంటామ‌ని తెలిపారు. 25 స్థానాల్లో కూట‌మి 17 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని షా వెల్ల‌డించారు.

అదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్‌లోనూ మెజారిటీ సీట్లుద‌క్కించుకోనున్న‌ట్టు షా తెలిపారు. ఇక్క‌డ 42 స్థానాల్లో 24 నుంచి 30 స్థానాల్లో బీజేపీ అభ్య‌ర్థులు గెల‌వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక‌, కీల‌క‌మైన ముస్లింల రిజ‌ర్వేష‌న్ అంశం గురించి మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క‌, ఏపీల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఓబీసీ కోటా కింద‌.. ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసింద‌ని.. ఇప్పుడు తాము కూడా వాటిని కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. అయితే.. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దేశ‌వ్యాప్తంగా యూసీసీ(ఉమ్మ‌డి పౌర‌స్మృతి)ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ విష‌యంలో రాజ్యాంగంలోనే పేర్కొన్నార‌ని తెలిపారు.

అదేవిదంగా జ‌మిలి ఎన్నిక‌లపైనా కీల‌క నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క‌క్క విధంగా ఎన్నిక‌లు జ‌రుగుతుం డడంతో ప్ర‌జ‌ల సమ‌యం.. ధ‌నం కూడా వృదా అవుతున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిపే విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. దీనిపై ఇప్ప‌ట‌కిఏ మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో క‌మిటీ కూడా రిపోర్టు ఇచ్చింద‌ని తెలిపారు. దీనిని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. అదేవిధంగా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ఇప్ప‌టికే అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని.. దీనివ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి హానీ క‌ల‌గ‌లేద‌న్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో విప‌క్ష కూట‌మి ఇండియా విఫ‌ల‌మైంద‌ని.. ప్ర‌జ‌లంతా మోడీ వెంటే ఉన్నార‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.

This post was last modified on May 28, 2024 7:12 am

Share
Show comments
Published by
Satya
Tags: Amit Shah

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

5 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

5 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

6 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

6 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

7 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

7 hours ago