ఆయ‌న‌కు మెజారిటీ త‌గ్గినా.. ఓడిపోయిన‌ట్టే!

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌. ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే విష‌యం తెలిసిందే. అయితే.. ఈసారి ఇదే వైఎస్ కుటుంబంలో త‌లెత్తిన వివాదంతో.. అన్నా చెల్లె ళ్లు చీలిపోయారు. దీంతో ఇక్క‌డ రాజ‌కీయ దుమారం రేగింది. ఫ‌లితంగా.. ఇక్క‌డ సీఎం జ‌గ‌న్‌కు పెద్ద ప‌రీక్ష పెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ‘జ‌గ‌న్ ఓడిపోవ‌డం కుదిరే ప‌ని కాదు. ఇది ఎవ‌రూ చేయ‌లేరులే… కానీ, ఆయ‌నకు మెజారిటీ త‌గ్గినా ఓడిపోయిన‌ట్టే క‌దా!’ అని అంటున్నారు స్థానికులు.

నిజానికి అప్ర‌తిహ‌త విజ‌యంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌.. గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ దక్కించుకుని రాష్ట్రంలోనే మెజారిటీ ఎక్కువ ద‌క్కించుకున్న నాయ‌కుడిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డును ఈ సారి ఆయ‌న అధిగ‌మించ‌లేక పోవ‌చ్చ‌నే అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయ‌న గెలుపు ఖాయ‌మే అయినా… ముప్పేట దిగ్బంధించిన ఇత‌ర పార్టీల కార‌ణంగా జ‌గ‌న్ మెజారిటీ త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

టీడీపీనుంచి బీటెక్ ర‌వి పోటీలో ఉన్నారు. ఈయ‌న ఇక్క‌డ చిర‌ప‌రిచితుడు. పైగా..మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా త‌న ఎమ్మెల్సీ సీటును తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారు. దీంతో చాలా వ‌ర‌కు సింప‌తీ గెయిన్ చేశారు. ఫ‌లితంగా మెజారిటీ ఓట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. అయితే..ఈయ‌న ద‌క్కించుకునే ఓట్ల‌న్నీ కూడా.. సీఎం ఖాతాలోవేన‌ని చెబుతున్నారు. ఇది ఒక‌ర‌కంగా వైసీపీ అధినేత‌కు ఇబ్బందిగా మార‌నుంది. ఇది భారీ మెజారిటీని త‌గ్గిస్తుంద‌ని అంట‌న్నారు.

ఇక‌, కాంగ్రెస్ కూడా ఈ ద‌ఫా ఇక్క‌డ బ‌ల‌మైన సెంటిమెంటునే రాజేసింది. జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌.. ఇక్క‌డ కొంగు ప‌ట్టి ఓట్లు అడిగారు. అయితే.. ఇది సెంటిమెంటును రాజేయ‌డంతో ఆమె ఒక్క‌రికే కాకుండా.. గ్రామీణ ప్ర‌జ‌లు క‌నుక మొగ్గు చూపి ఉంటే..పులివెందుల సీటులో కూడా.. కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డతాయ‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. మ‌రింత‌గా సీఎం జ‌గ‌న్‌కు డ్యామేజీ జ‌రిగి.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజారిటీ 90 వేల‌లో స‌గం లేదా.. అంత‌క‌న్నా ఓట్లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.