భారతీయ సినిమాలో కొన్నేళ్లుగా బయోపిక్ల హవా నడుస్తోంది. ఐతే ఎక్కువగా స్పోర్ట్స్ బయోపిక్స్యే తెరకెక్కుతున్నాయి. అవే విజయవంతం అవుతున్నాయి. పొలిటికల్ మైలేజీ కోసం రాజకీయ నేతల బయోపిక్స్ కూడా తెరకెక్కతున్నాయి కానీ.. వాటిలో విజయవంతమవుతున్నవి అరుదే. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్సార్ల మీద సినిమాలు తీశారు. వీటిలో దేనికీ బాక్సాఫీస్ సక్సెస్ దక్కలేదు.
‘యాత్ర’ దాని స్థాయిలో ఓ మోస్తరుగా అయినా ఆడింది కానీ.. ‘యన్.టి.ఆర్’ సినిమా అంచనాల్ని అందుకోలేక చతికిలపడింది. మరాఠీలో బాల్ థాకరే మీద సినిమా తీస్తే అది కూడా పెద్దగా జనాల్ని మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మీద అపారమైన అభిమానంతో గత ఏడాది ఎన్నికలకు ముందు ‘పీఎం నరేంద్ర మోడీ’ పేరుతో ఓ సినిమా తీశారు బాలీవుడ్ జనాలు.
వివేక్ ఒబెరాయ్ లాంటి ప్రముఖ నటుడు ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఐతే ఆద్యంతం మోడీ భజన చేస్తూ, ఆయనేదో లోక కళ్యాణం కోసమే పుట్టినట్లు చూపించిన ఈ సినిమాను ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. ఈ సినిమాతో వాళ్లు మోడీని మెప్పించి ఆయన ప్రాపకం ఏమైనా సంపాదించారేమో తెలియదు. ఐతే మోడీపై ఒక సినిమా తిరస్కరణకు గురయ్యాక మళ్లీ ఇప్పుడు ఇంకో సినిమా రెడీ అవుతుండటం విశేషం.
ఆ సినిమా పేరు.. మనో వైరాగి. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. బాలీవుడ్ ఫేమస్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గురువారం మోడీ పుట్టిన రోజు సందర్భంగా దీని ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో అభయ వర్మ అనే కొత్త నటుడు యువకుడైన మోడీ పాత్రలో కనిపంచనున్నాడు. సంజయ్ త్రిపాఠి దర్శకుడు. మరి ఈ సారైనా మోడీ సినిమా ఎగ్జాజరేషన్లు లేకుండా ఆకట్టుకునేలా తెరకెక్కుతుందేమో.. జనాలు పట్టించుకుంటారేమో చూడాలి.
This post was last modified on September 25, 2020 12:00 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…