ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు, పోలీసు ఆఫీసర్లకు రెడ్బుక్ భయం పట్టుకుందనే చర్చ హాట్టాపిక్గా మారింది. ఇన్ని రోజులు అధికార వైసీపీ ప్రభుత్వ అండ చూసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోయిన ఈ అధికారులు ఇప్పుడు దారికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోనే కాదు అక్కడి అధికార వర్గాల్లోనూ మార్పు స్ఫష్టంగా కనిపిస్తోందని తెలిసింది.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో టచ్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రెడ్బుక్లో పేర్లు ఉన్న వాళ్లు హడలెత్తిపోతున్నారని టాక్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా రెడ్బుక్ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. జగన్ అండతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు, ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను ఈ రెడ్బుక్లో రాసుకున్నానని లోకేశ్ అప్పుడు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుమన్నారు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు ఉండటంతో ఆయా అధికారుల్లో భయం మొదలైంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఒత్తిడి మేరకు అలా చేయాల్సి వచ్చింది కానీ తాము టీడీపీకి వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నాల్లో ఈ అధికారులు ఉన్నారని తెలిసింది. మరోవైపు టీడీపీ విధేయులుగా ఉన్న అధికారులు కూడా కీలక పోస్టింగ్ల కోసం ఇప్పటినుంచే సంప్రదింపులకు తెరలేపినట్లు సమాచారం.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…