ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు, పోలీసు ఆఫీసర్లకు రెడ్బుక్ భయం పట్టుకుందనే చర్చ హాట్టాపిక్గా మారింది. ఇన్ని రోజులు అధికార వైసీపీ ప్రభుత్వ అండ చూసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోయిన ఈ అధికారులు ఇప్పుడు దారికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోనే కాదు అక్కడి అధికార వర్గాల్లోనూ మార్పు స్ఫష్టంగా కనిపిస్తోందని తెలిసింది.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో టచ్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రెడ్బుక్లో పేర్లు ఉన్న వాళ్లు హడలెత్తిపోతున్నారని టాక్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా రెడ్బుక్ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. జగన్ అండతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు, ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను ఈ రెడ్బుక్లో రాసుకున్నానని లోకేశ్ అప్పుడు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుమన్నారు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు ఉండటంతో ఆయా అధికారుల్లో భయం మొదలైంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఒత్తిడి మేరకు అలా చేయాల్సి వచ్చింది కానీ తాము టీడీపీకి వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నాల్లో ఈ అధికారులు ఉన్నారని తెలిసింది. మరోవైపు టీడీపీ విధేయులుగా ఉన్న అధికారులు కూడా కీలక పోస్టింగ్ల కోసం ఇప్పటినుంచే సంప్రదింపులకు తెరలేపినట్లు సమాచారం.
This post was last modified on May 21, 2024 11:01 am
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…