Political News

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని.. అందుకే ఆయ‌న ఈ రాష్ట్రమే కాదు.. దేశం నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నార‌ని.. ఓ వ‌ర్గం టీడీపీ నాయ‌కులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. పెద్దిరెడ్డి దేశం విడిచి పోయేది.. జూన్ 1-3 మ‌ధ్య‌లోనేన‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, ఇదేవిష‌యంపై సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున పోస్టులు వ‌చ్చాయి. పెద్దిరెడ్డి ప‌రార్‌ అనే కామెంట్లు వినిపించాయి.

ఈ వ్యాఖ్య‌లపై తాజాగా మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. త‌మ‌కు రాష్ట్రంలోనేకాదు.. దేశం నుంచి కూడా వెళ్లిపోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఆఫ్రిక‌న్ దేశాల్లో తాము వ్యాపారాలు చేసుకుంటున్నామ‌ని.. అక్క‌డి వెళ్లి వ‌స్తూ ఉంటామ‌ని.. దీనిని ప‌ట్టుకుని కొంద రు ప‌నిలేని టీడీపీ నాయ‌కులు.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని అన్నారు. “ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని వారు.. ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకోలేని వారుకొంద‌రు నాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీరంద‌రికి జూన్ 4న ప్ర‌జ‌లే స‌మాధానం చెబుతారు” అని పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నారా లోకేష్‌పైనా ఈ సంద‌ర్భంగా కామెంట్లు చేశారు.

మంగ‌ళ‌గిరిలో గెలిచి చూపించ‌మ‌నండి! అని పెద్దిరెడ్డి అన్నారు. తాను, త‌న కుమారుడు, త‌మ కుటుంబం రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుంచి వ్యాపారాలు చేస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. రాజ‌కీయాల్లో సంపాయించింది ఏమీ లేద‌ని.. వ్యాపారాల్లో తెచ్చుకున్న సొమ్మునే రాజ‌కీయాల్లో చాలా ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారి స్థాయి ఏంటో అంద‌రికీ తెలిసిందేన‌ని చెప్పారు. తాము ఎక్క‌డికీ పారిపోవ‌డం లేద‌న్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచితాను చంద్ర‌బాబు బ‌ద్ధ వ్య‌తిరేకుల‌మ‌ని పెద్ది రెడ్డి చెప్పారు. ఈ విష‌యం చిత్తూరు ప్ర‌జ‌ల‌కు, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసున‌న్నారు.

ఇక‌, పోలింగ్ పెర‌గ‌డానికి త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు.. అమ‌లు చేసిన సంక్షేమ‌మే కార‌ణమ‌ని పెద్దిరెడ్డి చెప్పారు. అనేక మంది ల‌బ్ధి పొందార‌ని.. తిన్న‌ది మ‌రిచిపోర‌ని.. వారే క్యూల‌లో నిల‌బ‌డి ఓటేశార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మ‌హిళా ఓటు బ్యాంకు పెర‌గడానికి.. వైసీపీ తీసుకువ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాలే కార‌ణ‌మ‌ని పెద్దిరెడ్డి వివ‌రించారు. దీనిని త‌మ‌కు అనుకూలంగానే భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఎవ‌రో వ‌చ్చిత‌మ‌కు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఎవ‌రు ఎలాంటి వారో.. చిత్తూరు ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on May 20, 2024 8:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

1 hour ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

3 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

3 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

5 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

7 hours ago

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…

7 hours ago