వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి పోటీ చేసిన టీడీపీ నాయకుడు రఘురామకృష్ణరాజు చెప్పారు. ఓటమి భయం ఆ పార్టీ నేతల్లో మామూలుగా లేదన్నారు. తనకు చాలా మంది టచ్లో ఉన్నారన్న ఆయన వారితో మాట్లాడినప్పుడు.. కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అన్న ఆందోళనలో ఉన్నారని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ.. రాష్ట్రంలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని తెలిపారు. చంద్రబాబు, పవన్ ఇమేజ్ బాగా పనిచేసిందన్నారు.
దీనిని చర్చకురాకుండా చేసేందుకే వైసీపీ పన్నాగాలు పన్నుతోందని రఘురామ విమర్శించారు. వైసీపీలో ఓటమి భయం ఉందని, అందుకే పలు ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ తర్వాత.. హింసకు పాల్పడిందని చెప్పారు. “నోరు అబద్ధం చెప్పినా.. కళ్లు మాత్రం నిజమే చెబుతాయి. ఈ విషయం సజ్జల కళ్లను చూస్తే అర్థమవుతుంది” అని రఘురామ పేర్కొన్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య విజయం వచ్చిన మాట వాస్తవమేనని .. దీనిని ఎవరూ ఊహించలేదని చెప్పారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండబోదన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవచ్చని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఎప్పుడు ఎన్నికలు వస్తే.. అప్పుడు జగన్ను ఇంటికి పంపించాలని నిర్ణయిం చుకున్నారని.. వారు ఈ ఎన్నికల్లో తమ తడాఖా చూపించారని రఘురామ తెలిపారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే.. ఉద్యోగుల ఓట్లు దాదాపు 88 శాతం నమోదైనట్టు తెలుస్తోందన్నారు. ఇది పూర్తిగా కూటమికి అనుకూలంగా నే పడిందని చెప్పారు. చివరకు సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందులలో కూడా.. ఫైట్ మామూలుగా లేదని రఘురామ తెలిపారు. పుంగనూరులోనూ పెద్దిరెడ్డికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలుపుపై తర్జన భర్జన ఉందని.. ఇవన్నీ.. వారిని చూస్తేనే అర్ధమవుతుందని రఘురామ వ్యాఖ్యానించారు.
This post was last modified on May 18, 2024 7:35 am
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…