Political News

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి పోటీ చేసిన టీడీపీ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చెప్పారు. ఓట‌మి భ‌యం ఆ పార్టీ నేత‌ల్లో మామూలుగా లేద‌న్నారు. త‌న‌కు చాలా మంది ట‌చ్‌లో ఉన్నార‌న్న ఆయ‌న వారితో మాట్లాడిన‌ప్పుడు.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కుతుందా? అన్న ఆందోళ‌న‌లో ఉన్నార‌ని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ‌.. రాష్ట్రంలో కూట‌మి గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని తెలిపారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇమేజ్ బాగా ప‌నిచేసింద‌న్నారు.

దీనిని చ‌ర్చ‌కురాకుండా చేసేందుకే వైసీపీ ప‌న్నాగాలు ప‌న్నుతోంద‌ని ర‌ఘురామ విమ‌ర్శించారు. వైసీపీలో ఓట‌మి భయం ఉంద‌ని, అందుకే ప‌లు ప్రాంతాల్లో ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత‌.. హింస‌కు పాల్ప‌డింద‌ని చెప్పారు. “నోరు అబ‌ద్ధం చెప్పినా.. క‌ళ్లు మాత్రం నిజ‌మే చెబుతాయి. ఈ విష‌యం స‌జ్జ‌ల క‌ళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది” అని ర‌ఘురామ పేర్కొన్నారు. గ‌తంలో జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి అనూహ్య విజ‌యం వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని .. దీనిని ఎవ‌రూ ఊహించ‌లేద‌ని చెప్పారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప‌రిస్థితి ఉండ‌బోద‌న్నారు. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులు వైసీపీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. అప్పుడు జ‌గ‌న్‌ను ఇంటికి పంపించాల‌ని నిర్ణ‌యిం చుకున్నార‌ని.. వారు ఈ ఎన్నిక‌ల్లో త‌మ త‌డాఖా చూపించార‌ని ర‌ఘురామ తెలిపారు. ఎన్నిక‌ల సంఘం లెక్క‌ల ప్ర‌కార‌మే.. ఉద్యోగుల ఓట్లు దాదాపు 88 శాతం న‌మోదైన‌ట్టు తెలుస్తోంద‌న్నారు. ఇది పూర్తిగా కూట‌మికి అనుకూలంగా నే ప‌డింద‌ని చెప్పారు. చివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ పోటీలో ఉన్న పులివెందుల‌లో కూడా.. ఫైట్ మామూలుగా లేద‌ని ర‌ఘురామ తెలిపారు. పుంగ‌నూరులోనూ పెద్దిరెడ్డికి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయ‌ని, చీపురుప‌ల్లిలో బొత్స స‌త్య‌నారాయ‌ణ గెలుపుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ఉంద‌ని.. ఇవ‌న్నీ.. వారిని చూస్తేనే అర్ధ‌మ‌వుతుంద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 18, 2024 7:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

11 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

49 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago