టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ప్రధాని మోడీ బిగ్ ఆఫర్ ఇచ్చారు. మోడీ వరుసగా మూడోసారి కూడా.. పరమ పవిత్ర కాశీ నియోజకవర్గం(వారణాసి) నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలకు కూడా ఆయన ఆహ్వానం పంపించారు. దీంతో చంద్రబాబు కూడా అక్కడకు వెళ్లారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఈ సమయంలో మోడీ.. చంద్రబాబుతో సరదాగా మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారం విషయాన్ని ప్రస్తావించారు. మీరు చాలా కష్టపడ్డారు. ఎండలో కూడా లెక్కచేయకుండా ప్రచారం చేశారు. మీ కష్టం ఫలిస్తుంది.. దీనికి సంబంధించి న ఫలాలను జూన్ 4న మీరు అందుకోబోతున్నారని చెప్పారు. ఇదేసమయంలో ఆయన నా కోసం కూడా ప్రచారం చేస్తారా? అని నవ్వుతూ ప్రశ్నించారు.
వాస్తవానికి మోడీ నోటి నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని చంద్రబాబు ఊహించలేదు. కానీ.. మోడీ అడిగారు. దీంతో చంద్రబాబు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. నవ్వుతూ ఉండిపోయారు. వాస్తవానికి కూటమి పక్షాల నేతల్లో కీలకమైన వారిని బీజేపీ ప్రచారానికి వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా వర్గాల ప్రజలు ఎక్కడ ఉన్నా. కూటమి పార్టీల నేతలను వినియోగించి ప్రచారం చేయిస్తోంది. ఉదాహరణకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై.. కాశీలో తమిళులు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేస్తున్నారు.
అదేవిధంగా కాశీలో తెలుగు వారు కూడా ఎక్కువగా ఉన్నారు. వీరు కేవలం తీర్థయాత్రలకు మాత్రమే వెళ్లి వచ్చేవారు కాదు.. 5 శాతం జనాభా అక్కడే ఉండి.. వ్యాపారాలు.. పూజలు వంటి క్రతువుల్లో ఉన్నారు. అదేవిధంగా అన్న సత్రాలు నిర్వహిస్తున్నారు. టూరిజం స్పాట్గా కూడా అభివృద్ది చెందిన నేపథ్యంలో తెలుగు వారు పెరిగారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ప్రచారానికి రమ్మని మోడీ ఆహ్వానించి ఉంటారని భావించవచ్చు. మరి ఆయన వెళ్తారో.. లేదో చూడాలి.
This post was last modified on May 15, 2024 4:30 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…