టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ప్రధాని మోడీ బిగ్ ఆఫర్ ఇచ్చారు. మోడీ వరుసగా మూడోసారి కూడా.. పరమ పవిత్ర కాశీ నియోజకవర్గం(వారణాసి) నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలకు కూడా ఆయన ఆహ్వానం పంపించారు. దీంతో చంద్రబాబు కూడా అక్కడకు వెళ్లారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఈ సమయంలో మోడీ.. చంద్రబాబుతో సరదాగా మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారం విషయాన్ని ప్రస్తావించారు. మీరు చాలా కష్టపడ్డారు. ఎండలో కూడా లెక్కచేయకుండా ప్రచారం చేశారు. మీ కష్టం ఫలిస్తుంది.. దీనికి సంబంధించి న ఫలాలను జూన్ 4న మీరు అందుకోబోతున్నారని చెప్పారు. ఇదేసమయంలో ఆయన నా కోసం కూడా ప్రచారం చేస్తారా? అని నవ్వుతూ ప్రశ్నించారు.
వాస్తవానికి మోడీ నోటి నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని చంద్రబాబు ఊహించలేదు. కానీ.. మోడీ అడిగారు. దీంతో చంద్రబాబు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. నవ్వుతూ ఉండిపోయారు. వాస్తవానికి కూటమి పక్షాల నేతల్లో కీలకమైన వారిని బీజేపీ ప్రచారానికి వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా వర్గాల ప్రజలు ఎక్కడ ఉన్నా. కూటమి పార్టీల నేతలను వినియోగించి ప్రచారం చేయిస్తోంది. ఉదాహరణకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై.. కాశీలో తమిళులు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేస్తున్నారు.
అదేవిధంగా కాశీలో తెలుగు వారు కూడా ఎక్కువగా ఉన్నారు. వీరు కేవలం తీర్థయాత్రలకు మాత్రమే వెళ్లి వచ్చేవారు కాదు.. 5 శాతం జనాభా అక్కడే ఉండి.. వ్యాపారాలు.. పూజలు వంటి క్రతువుల్లో ఉన్నారు. అదేవిధంగా అన్న సత్రాలు నిర్వహిస్తున్నారు. టూరిజం స్పాట్గా కూడా అభివృద్ది చెందిన నేపథ్యంలో తెలుగు వారు పెరిగారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ప్రచారానికి రమ్మని మోడీ ఆహ్వానించి ఉంటారని భావించవచ్చు. మరి ఆయన వెళ్తారో.. లేదో చూడాలి.
This post was last modified on May 15, 2024 4:30 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…