ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్ 5న తిహార్ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్ కేజ్రీవాల్ నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయంతో ఆయన ఊపిరి పీల్చుకున్నట్లేనని భావిస్తున్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘తిహార్లోని తన సెల్లో రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఫీడ్ను 13 మంది అధికారులు పర్యవేక్షించారు. సీసీటీవీ ఫీడ్ను పీఎంవోకు సైతం అందించారు. మోదీ సైతం దానిని పర్యవేక్షిస్తున్నారు. మోదీకి తనపై ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. బూత్ర్రూమ్కి వెళ్లడానికి నేను రాత్రి ఏ సమయానికి లేస్తానో కూడా వారు పర్యవేక్షించే వారు’ అన్నారు. కేజ్రీవాల్ డిప్రెషన్లో లేరని.. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తాను జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటికీ.. జూన్ 4న జైలులోనే ఫలితాలను చూస్తానన్నారు. ఇండియా కూటమి గెలిస్తేనే జూన్ 5న మళ్లీ బయటకు వస్తానని, ఈ ఎన్నికలలో కష్టపడకపోతే నేను మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on May 14, 2024 11:07 am
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…