ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్ 5న తిహార్ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్ కేజ్రీవాల్ నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయంతో ఆయన ఊపిరి పీల్చుకున్నట్లేనని భావిస్తున్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘తిహార్లోని తన సెల్లో రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఫీడ్ను 13 మంది అధికారులు పర్యవేక్షించారు. సీసీటీవీ ఫీడ్ను పీఎంవోకు సైతం అందించారు. మోదీ సైతం దానిని పర్యవేక్షిస్తున్నారు. మోదీకి తనపై ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. బూత్ర్రూమ్కి వెళ్లడానికి నేను రాత్రి ఏ సమయానికి లేస్తానో కూడా వారు పర్యవేక్షించే వారు’ అన్నారు. కేజ్రీవాల్ డిప్రెషన్లో లేరని.. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తాను జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటికీ.. జూన్ 4న జైలులోనే ఫలితాలను చూస్తానన్నారు. ఇండియా కూటమి గెలిస్తేనే జూన్ 5న మళ్లీ బయటకు వస్తానని, ఈ ఎన్నికలలో కష్టపడకపోతే నేను మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on May 14, 2024 11:07 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…