Political News

అరవింద్ కేజ్రివాల్ కు బిగ్ రిలీఫ్ !

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్‌ 5న తిహార్‌ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్‌ కేజ్రీవాల్‌ నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయంతో ఆయన ఊపిరి పీల్చుకున్నట్లేనని భావిస్తున్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘తిహార్‌లోని తన సెల్‌లో రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఫీడ్‌ను 13 మంది అధికారులు పర్యవేక్షించారు. సీసీటీవీ ఫీడ్‌ను పీఎంవోకు సైతం అందించారు. మోదీ సైతం దానిని పర్యవేక్షిస్తున్నారు. మోదీకి తనపై ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. బూత్‌ర్రూమ్‌కి వెళ్లడానికి నేను రాత్రి ఏ సమయానికి లేస్తానో కూడా వారు పర్యవేక్షించే వారు’ అన్నారు. కేజ్రీవాల్‌ డిప్రెషన్‌లో లేరని.. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తాను జూన్‌ 2న తిహార్‌ జైలుకు వెళ్లినప్పటికీ.. జూన్‌ 4న జైలులోనే ఫలితాలను చూస్తానన్నారు. ఇండియా కూటమి గెలిస్తేనే జూన్‌ 5న మళ్లీ బయటకు వస్తానని, ఈ ఎన్నికలలో కష్టపడకపోతే నేను మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని వ్యాఖ్యానించడం విశేషం.

This post was last modified on May 14, 2024 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago