ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్ 5న తిహార్ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్ కేజ్రీవాల్ నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయంతో ఆయన ఊపిరి పీల్చుకున్నట్లేనని భావిస్తున్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘తిహార్లోని తన సెల్లో రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఫీడ్ను 13 మంది అధికారులు పర్యవేక్షించారు. సీసీటీవీ ఫీడ్ను పీఎంవోకు సైతం అందించారు. మోదీ సైతం దానిని పర్యవేక్షిస్తున్నారు. మోదీకి తనపై ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. బూత్ర్రూమ్కి వెళ్లడానికి నేను రాత్రి ఏ సమయానికి లేస్తానో కూడా వారు పర్యవేక్షించే వారు’ అన్నారు. కేజ్రీవాల్ డిప్రెషన్లో లేరని.. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తాను జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటికీ.. జూన్ 4న జైలులోనే ఫలితాలను చూస్తానన్నారు. ఇండియా కూటమి గెలిస్తేనే జూన్ 5న మళ్లీ బయటకు వస్తానని, ఈ ఎన్నికలలో కష్టపడకపోతే నేను మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on May 14, 2024 11:07 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…