Political News

ఒక‌టి జ‌గ‌న్‌కు.. ఒక‌టి ష‌ర్మిల‌కు.. అవినాష్‌కు సున్నా

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి క‌థ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అత‌ను కోల్పోవాల్సిందేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని వైఎస్ అభిమానులు రెండుగా చీలిపోవ‌డమే అందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీకి ఓటు వేయాల‌ని అనుకుంటున్న అక్క‌డి జ‌నాలు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఓటును వైఎస్ ష‌ర్మిల‌కు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఒక‌టి అసెంబ్లీకి, మ‌రొక‌టి లోక్‌స‌భ‌కు ఇలా రెండు ఓట్లు వేసే అవ‌కాశం ఉన్న క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ఒక‌టి, ష‌ర్మిల‌కు ఒక‌టి వేసేందుకు మొగ్గు చూపే ఆస్కార‌ముంది.

క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తూ అవినాష్‌ను ఓడించి విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ష‌ర్మిల సాగుతున్నారు. వివేకా హ‌త్య కేసును ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ అవినాష్‌పై ఆమె మాట‌ల తూటాలు విసురుతున్నారు. రాజ‌న్న బిడ్డ‌ను ఆద‌రించాల‌ని కోరుతున్నారు. దీంతో ఆమె ప్ర‌చారానికి ఇక్క‌డ మంచి స్పంద‌న వ‌స్తోంది. ఆమె పోరాటం గురించి ప్ర‌తి ఇంట్లోనూ చ‌ర్చ సాగుతోంద‌ని తెలిసింది. వైసీపీకి వీర విధేయులైన నాయ‌కులు కూడా వైఎస్ త‌న‌య‌కు అన్యాయం చేయ‌డం ఎందుకు? ఓ ఓటు వేద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం.

పులివెందుల‌లో జ‌గ‌న్‌కు ఓటు వేసే జ‌నాలు.. పార్ల‌మెంట్ స్థానానికి వ‌చ్చే స‌రికి ష‌ర్మిలకు ఓటు వేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ విధంగా చూస్తే పులివెందుల‌లో అవినాష్ కంటే ష‌ర్మిల‌కే ఎక్కువ ఓట్లు వ‌చ్చే ఆస్కార‌ముంది. అలాగే వివేకానంద‌రెడ్డి ప్ర‌భావం ఉన్న జ‌మ్మ‌ల‌మ‌డుగులోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. అక్క‌డ కూడా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అవినాష్‌ను కాద‌ని ష‌ర్మిల‌కే ఓటు వేసే అవ‌కాశం ఉంది. ఇలా చూసుకుంటే క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో అవినాష్ ఓట‌మి ఖాయ‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ష‌ర్మిల విజ‌యానికి చేరువవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

6 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

9 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

9 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

10 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

10 hours ago