మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలపై తన మనసులో మాట వెల్లడించారు. పాలిటిక్స్కు తాను అతీతంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే తోడబుట్టిన వాడు కనుక పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, అందరూ.. ఎదురు చూసినట్టు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారానికి చిరు వెళ్తారా? లేదా? అన్న ఉత్కంఠకు కూడా.. చిరంజీవి చెక్ పెట్టారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.
పవన్ కల్యాణ్ కు కూడా.. తనను పిఠాపురం వచ్చి ప్రచారం చేయాలని కోరుకునే మనస్తత్వం లేదన్నారు. అయితే.. సోదరుడిగా పవన్ కల్యాణ్ మంచిని కోరుకుంటున్నట్టు చెప్పారు. పవన్ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నట్టు చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లో మీడియాకు వివరించారు. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఢిల్లీ నుంచి శక్రవారం తిరిగి వచ్చారు. ఈ సమయంలో విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట మెగా స్టార్.. ఓ వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే. పిఠాపురంలో తన సోదరుడు, జనసేన అధినేత పవన్ను ఆయన గెలిపించాలని కోరారు. ఆశయాలు మంచివని.. ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చాడని.. తను గెలవకపోయినా.. ప్రజలకు, పేదలకు అండగా ఉన్నాడని తెలిపారు. అలాంటి గళం.. అసెంబ్లీలో ఉంటే.. మరింతగా పేదలకు న్యాయం జరుగుతుందని చిరు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
This post was last modified on May 10, 2024 2:54 pm
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…