మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలపై తన మనసులో మాట వెల్లడించారు. పాలిటిక్స్కు తాను అతీతంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే తోడబుట్టిన వాడు కనుక పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, అందరూ.. ఎదురు చూసినట్టు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారానికి చిరు వెళ్తారా? లేదా? అన్న ఉత్కంఠకు కూడా.. చిరంజీవి చెక్ పెట్టారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.
పవన్ కల్యాణ్ కు కూడా.. తనను పిఠాపురం వచ్చి ప్రచారం చేయాలని కోరుకునే మనస్తత్వం లేదన్నారు. అయితే.. సోదరుడిగా పవన్ కల్యాణ్ మంచిని కోరుకుంటున్నట్టు చెప్పారు. పవన్ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నట్టు చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లో మీడియాకు వివరించారు. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఢిల్లీ నుంచి శక్రవారం తిరిగి వచ్చారు. ఈ సమయంలో విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట మెగా స్టార్.. ఓ వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే. పిఠాపురంలో తన సోదరుడు, జనసేన అధినేత పవన్ను ఆయన గెలిపించాలని కోరారు. ఆశయాలు మంచివని.. ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చాడని.. తను గెలవకపోయినా.. ప్రజలకు, పేదలకు అండగా ఉన్నాడని తెలిపారు. అలాంటి గళం.. అసెంబ్లీలో ఉంటే.. మరింతగా పేదలకు న్యాయం జరుగుతుందని చిరు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
This post was last modified on May 10, 2024 2:54 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…