Political News

కాంగ్రెస్ లో కల్లోలం రేపిన రాహుల్ సభ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా ముందుకుసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు నియోజకవర్గాలలో గెలుపు లక్ష్యంగా బహిరంగ సభకు విచ్చేశాడు. కానీ అక్కడ పట్టుమని ఐదు వేల మంది జనాలు లేరు. సాయంత్రం 6 గంటలకు వచ్చి స్టేజి ఎక్కకుండా రాహుల్ గాంధీ కారవాన్ లోనే ఉండిపోయాడు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి స్టేడియం బయట ఉన్న జనాలను లోపలికి పంపాలని గేటు వద్ద నిలుచుని పిలవడం కనిపించింది. ఎట్టకేలకు 7.10 గంటలకు స్టేజీ మీదకు వచ్చిన రాహుల్ గాంధీ కేవలం 16 నిమిషాలలో ప్రసంగం ముగించి మమ అనిపించారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి, భువనగిరి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన రాహుల్ సభ అట్టర్ ప్లాప్ కావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఏకంగా రాహుల్ గాంధీ వచ్చిన సభకు జన సమీకరణలో విఫలం కావడంపై రేవంత్ రెడ్డి స్టేజీ మీదనే నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భువనగిరి నియోజకవర్గం నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల నుండి గడ్డం రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి నుండి సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసమీకరణలో విఫలమై రాహుల్ ముందు పరువు తీశారని రేవంత్ అన్నట్లు తెలుస్తున్నది. బహిరంగ సభ ముగిసిని తర్వాత రాహుల్ గాంధీ ఒక సిటీ బస్ ఎక్కి కొంతదూరం ప్రయాణించాడు. బస్సులో కాంగ్రెస్ కరపత్రాలు పంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరాడు. అనంతరం బస్సు దిగి తన కారవాన్ లో ఎక్కి వెళ్లిపోయాడు. సరూర్ నగర్ సభ ప్లాప్ నేపథ్యంలో ఈ మూడు రోజులలో జాగ్రత్తగా అడుగులు వేసి ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

This post was last modified on May 10, 2024 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago