తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా ముందుకుసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు నియోజకవర్గాలలో గెలుపు లక్ష్యంగా బహిరంగ సభకు విచ్చేశాడు. కానీ అక్కడ పట్టుమని ఐదు వేల మంది జనాలు లేరు. సాయంత్రం 6 గంటలకు వచ్చి స్టేజి ఎక్కకుండా రాహుల్ గాంధీ కారవాన్ లోనే ఉండిపోయాడు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి స్టేడియం బయట ఉన్న జనాలను లోపలికి పంపాలని గేటు వద్ద నిలుచుని పిలవడం కనిపించింది. ఎట్టకేలకు 7.10 గంటలకు స్టేజీ మీదకు వచ్చిన రాహుల్ గాంధీ కేవలం 16 నిమిషాలలో ప్రసంగం ముగించి మమ అనిపించారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి, భువనగిరి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన రాహుల్ సభ అట్టర్ ప్లాప్ కావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఏకంగా రాహుల్ గాంధీ వచ్చిన సభకు జన సమీకరణలో విఫలం కావడంపై రేవంత్ రెడ్డి స్టేజీ మీదనే నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భువనగిరి నియోజకవర్గం నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల నుండి గడ్డం రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి నుండి సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసమీకరణలో విఫలమై రాహుల్ ముందు పరువు తీశారని రేవంత్ అన్నట్లు తెలుస్తున్నది. బహిరంగ సభ ముగిసిని తర్వాత రాహుల్ గాంధీ ఒక సిటీ బస్ ఎక్కి కొంతదూరం ప్రయాణించాడు. బస్సులో కాంగ్రెస్ కరపత్రాలు పంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరాడు. అనంతరం బస్సు దిగి తన కారవాన్ లో ఎక్కి వెళ్లిపోయాడు. సరూర్ నగర్ సభ ప్లాప్ నేపథ్యంలో ఈ మూడు రోజులలో జాగ్రత్తగా అడుగులు వేసి ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
This post was last modified on May 10, 2024 10:46 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…