ఏపీ సీఎం జగన్ ఈ నెల 17 నుంచి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉండడంతో దీనికి కోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ తరఫున న్యాయవాదులు గుట్టు చప్పుడు కాకుండా ఈ నెల 6వ తేదీనే.. హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. ప్రస్తుతం జగన్ పై నమోదైన కేసుల విచారణ శర వేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ దశలో ఆయనను విదేశాలకు అనుమతి ఇస్తే.. కేసుల విచారణ మందగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు సీబీఐ వేసిన కౌంటర్లో పలు విషయాలు వెల్లడించడం విశేషం. జగన్ను విదేశాలకు అనుమతించేందుకు తాము వ్యతిరేకమని సీబీఐ స్పష్టం చేసింది.
ఇక, సీఎం జగన్ తరఫు న్యాయవాదులు మాత్రం.. గత ఏడాది నవంబరులో అనుమతించారని.. అప్పట్లో నూ.. ఆయన విదేశాలకు వెళ్లి.. ఎలాంటి ఇబ్బందులూ కలిగించకుండానే తిరిగి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆయన కుమార్తెలు బ్రిటన్లో చదువుతున్నారని.. అదేవిధంగా జెరూసలేం వెళ్లి ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉందని కాబట్టి.. విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వాలని కేసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది. మరి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. జగన్ పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 17న విదేశాలకు(బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్) వెళ్లనున్నారు. వచ్చే నెల 1న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కాగా, ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 4న ఫలితం రానుంది.
This post was last modified on May 9, 2024 2:47 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…