ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో 30 గ్రామాలు కొట్టుకుపోయి.. 12 మంది మరణించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. ఇలాంటి మాపియాలకు ఇక్కడి ప్రభుత్వంమద్దతు ఇస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాఫియాగాళ్లకు కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వీరికి సరైన ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన రాయలసీమ సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక్కడి రైతులకు గిట్టుబాట ధరలు లభించడం లేదని.. కోల్డు స్టోరేజీలు లేకపోవడంతో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల విషయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. పులివెందులలో అరటి పంటల ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అయితే.. ఇవన్నీ కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే సాకారం అవుతాయన్నారు. పోలవరం సహా.. అనేక ప్రాజెక్టులను ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు.
ఇదేసమయంలో సీమ నుంచి ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారని..కానీ, ఈ ప్రాంతం ఇంకా కరువు పీడిత ప్రాంతంగా ఎందుకు ఉండిపోయిందో ఇక్కడి వారు ఆలోచించాలని మోడీ చెప్పడం గమనార్హం. ఇక్కడ నుంచి వలసలు పెరిగాయని.. అయినా ఏ ముఖ్యమంత్రీ చర్యలు తీసుకున్న పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించనున్నట్టు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. రాష్ట్రం అభివృద్ది బాటలో దూసుకుపోతుందన్నారు. పలు రైలు ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. ఆయా వివరాలు వెల్లడించారు.
వైసీపీ విశ్వాసఘాతుకం!
గత ఎన్నికల్లో ప్రజలు అనేక ఆకాంక్షలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు ఏర్పాటు చేసుకున్నారని మోడీ అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాలను నిండా ముంచిందని.. విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని అన్నారు. పేదలను వారి మానాన వారిని వదిలేసిందని అన్నారు. కేవలం మాఫియాను మాత్రమే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని నిప్పులు చెరిగారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మాఫియాకు తగిన ట్రీట్ మెంట్ చేస్తామన్నారు.
This post was last modified on May 8, 2024 6:59 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…