Political News

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో 30 గ్రామాలు కొట్టుకుపోయి.. 12 మంది మ‌ర‌ణించార‌ని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన‌ట్టు చెప్పారు. ఇలాంటి మాపియాల‌కు ఇక్క‌డి ప్ర‌భుత్వంమ‌ద్ద‌తు ఇస్తోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మాఫియాగాళ్ల‌కు కౌంట్ డౌన్ మొద‌లైంద‌ని ప్ర‌ధాని చెప్పారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వీరికి స‌రైన ట్రీట్‌మెంట్ ఇస్తామ‌న్నారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌ధాని హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా ఫోక‌స్ చేశారు. ఇక్క‌డి రైతుల‌కు గిట్టుబాట ధ‌ర‌లు ల‌భించ‌డం లేద‌ని.. కోల్డు స్టోరేజీలు లేక‌పోవ‌డంతో ట‌మాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల విష‌యాన్ని కూడా మోడీ ప్ర‌స్తావించారు. పులివెందుల‌లో అర‌టి పంట‌ల‌ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అయితే.. ఇవ‌న్నీ కూడా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంతోనే సాకారం అవుతాయ‌న్నారు. పోల‌వ‌రం స‌హా.. అనేక ప్రాజెక్టుల‌ను ఇక్క‌డి ప్ర‌భుత్వం అడ్డుకుంద‌ని చెప్పారు.

ఇదేస‌మ‌యంలో సీమ నుంచి ముఖ్య‌మంత్రులు చాలా మంది వ‌చ్చార‌ని..కానీ, ఈ ప్రాంతం ఇంకా క‌రువు పీడిత ప్రాంతంగా ఎందుకు ఉండిపోయిందో ఇక్క‌డి వారు ఆలోచించాల‌ని మోడీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ నుంచి వ‌ల‌స‌లు పెరిగాయ‌ని.. అయినా ఏ ముఖ్య‌మంత్రీ చ‌ర్య‌లు తీసుకున్న ప‌రిస్థితి లేకుండా పోయింద‌న్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు వ‌స్తే.. రాష్ట్రం అభివృద్ది బాట‌లో దూసుకుపోతుంద‌న్నారు. ప‌లు రైలు ప్రాజెక్టుల‌కు కూడా శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు చెప్పారు. ఆయా వివ‌రాలు వెల్ల‌డించారు.

వైసీపీ విశ్వాస‌ఘాతుకం!

గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అనేక ఆకాంక్ష‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏర్పాటు చేసుకున్నార‌ని మోడీ అన్నారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల విశ్వాసాల‌ను నిండా ముంచింద‌ని.. విశ్వాస ఘాతుకానికి పాల్ప‌డింద‌ని అన్నారు. పేద‌ల‌ను వారి మానాన వారిని వ‌దిలేసింద‌ని అన్నారు. కేవ‌లం మాఫియాను మాత్ర‌మే వైసీపీ ప్ర‌భుత్వం అభివృద్ధి చేసింద‌ని నిప్పులు చెరిగారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మాఫియాకు త‌గిన ట్రీట్ మెంట్ చేస్తామ‌న్నారు.

This post was last modified on May 8, 2024 6:59 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

10 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

2 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

4 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

4 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago