Political News

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

“నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు అంటున్నారు. ఇంత ఘోరంగా నేను ఎవ‌రితోనూ అనిపించుకోలేదు. నాకు కూడా ఒక రోజు వ‌స్తుంది. అప్పుడు అక్క‌లే నాకు క్ష‌మాప‌ణ‌లు చెబుతారు” అని క‌డ‌ప ఎంపీ, వైసీపీ అభ్య‌ర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న క‌డ‌ప‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌చార వాహ‌నంపై నుంచి మాట్లాడుతూ.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వైఎస్ ష‌ర్మిల‌, సునీత ల గురించి కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

త‌న‌పై సొంత అక్క‌లే త‌ప్పుడు ఆరోప‌ణలు చేస్తున్నార‌ని అవినాష్ రెడ్డి వాపోయారు. సునీత‌, ష‌ర్మిల‌లు వాస్త‌వాలు తెలుసుకుని.. త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పే రోజు కోసంఎదురు చూస్తున్నాన‌ని.. ఆ రోజు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అవినాష్‌ వ్యాఖ్యానించారు. “ష‌ర్మిల‌క్క‌.. సునీతక్క‌.. నాపై అన‌రాని మాట‌లు అంటున్నారు. నిజానికి వేరేవాళ్ల‌కైతే కోపం వ‌స్తుంది. కానీ, నాకు బాధ క‌లుగుతోంది. ఎందుకంటే వారు చేస్తున్న వ్యాఖ్య‌ల్లో నిజం లేదు. నాకు ఏ పాపం తెలియ‌దు” అని అవినాష్ రెడ్డివ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మేనేజ్ చేస్తున్నార‌ని.. ఆయ‌న ఆపార్టీకి సీఈవోగా వ్య‌వ‌హ‌రి స్తున్నార‌ని అవినాష్ రెడ్డి అన్నారు. అందుకే.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు కాంగ్రెస్ ఆడుతోంద‌ని.. కాంగ్రెస్ చెప్పిన‌ట్టు ష‌ర్మిల‌, సునీత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టుల‌నే వారు చ‌దువుతున్నార‌ని అవినాష్ విమ‌ర్శించారు. 2021 వ‌ర‌కు మాట్లాడ‌ని వారు ఇప్పుడు ఎందుకు ఎన్నిక‌ల ముందు త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తప్పుడు ప్రచారంతో తనను జైలుకు పంపించాల‌ని చూస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

2 hours ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

3 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

3 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

4 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

4 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

4 hours ago