“నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు అంటున్నారు. ఇంత ఘోరంగా నేను ఎవరితోనూ అనిపించుకోలేదు. నాకు కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు అక్కలే నాకు క్షమాపణలు చెబుతారు” అని కడప ఎంపీ, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కడపలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై నుంచి మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల, సునీత ల గురించి కామెంట్లు చేయడం గమనార్హం.
తనపై సొంత అక్కలే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి వాపోయారు. సునీత, షర్మిలలు వాస్తవాలు తెలుసుకుని.. తనకు క్షమాపణలు చెప్పే రోజు కోసంఎదురు చూస్తున్నానని.. ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని అవినాష్ వ్యాఖ్యానించారు. “షర్మిలక్క.. సునీతక్క.. నాపై అనరాని మాటలు అంటున్నారు. నిజానికి వేరేవాళ్లకైతే కోపం వస్తుంది. కానీ, నాకు బాధ కలుగుతోంది. ఎందుకంటే వారు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదు. నాకు ఏ పాపం తెలియదు” అని అవినాష్ రెడ్డివ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీని టీడీపీ అధినేత చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని.. ఆయన ఆపార్టీకి సీఈవోగా వ్యవహరి స్తున్నారని అవినాష్ రెడ్డి అన్నారు. అందుకే.. చంద్రబాబు చెప్పినట్టు కాంగ్రెస్ ఆడుతోందని.. కాంగ్రెస్ చెప్పినట్టు షర్మిల, సునీతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులనే వారు చదువుతున్నారని అవినాష్ విమర్శించారు. 2021 వరకు మాట్లాడని వారు ఇప్పుడు ఎందుకు ఎన్నికల ముందు తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ప్రచారంతో తనను జైలుకు పంపించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on May 8, 2024 6:50 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…