లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019 ఎన్నికలలో యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానాల నుండి పోటీ చేసి అమేథీలో ఓటమి, వయనాడ్ లో విజయం దక్కించుకున్నాడు రాహుల్. ఈ ఎన్నికలలో మరో సారి వయనాడ్ నుండి ఎంపీగా మరోసారి బరిలోకి దిగాడు. అక్కడ పోలింగ్ తొలిదశలోనే ముగిసింది.
వయనాడ్ లో ఈ సారి విజయం మీద ఏమయినా అపనమ్మకం ఉందో ఏమో తెలియదు గానీ రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుండి పోటీకి దిగనున్నాడని ప్రచారం జరిగింది. అమేథీ నుండి రాహుల్, రాయ్ బరేలి నుండి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్ బరేలీ నుండి పోటీ దిగుతాడని కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. ఇక అమేథీ నుండి కాంగ్రెస్ తరపున కిశోరీ లాల్ శర్మను పోటీలోకి దించారు.
గత ఎన్నికల్లో అమేథీ నుండి రాహుల్ బీజేపీ నేత స్మృతిఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ సారి కూడా ఆమె అక్కడి నుండే పోటీ చేస్తుండగా, అనాదిగా తమకు అండగా ఉన్న అమేథీని రాహుల్ వదిలేయడం గమనార్హం. అమేథీ నుండి 1980లో సంజయ్ గాంధీ, 1981, 1984, 1989, 1991లలో రాజీవ్ గాంధీ, 1999లో సోనియాగాంధీ, 2004 నుండి 2014 వరకు రాహుల్ గాంధీ ఎంపీలుగా గెలిచారు.
రాయ్ బరేలీ నుండి 1952, 1957లలో ఫిరోజ్ గాంధీ, 1967, 1971, 1980లలో ఇందిరాగాంధీ, 2004, 2009, 2014, 2019లలో సోనియాగాంధీలు వరసగా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికవగా అమేథిని వదిలిపెట్టి రాహుల్ రాయ్ బరేలీ నుండి పోటీ చేస్తుండడం విశేషం.
This post was last modified on May 3, 2024 1:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…