Political News

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్యాలెట్ నెంబ‌ర్ ఖ‌రారు.. ఈజీగా ఓటేయొచ్చు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయన నామినేష‌న్ ఆమోదం పొంద‌డం.. గుర్తును కూ డా కేటాయించిన విష‌యం విదితమే. రిజిస్ట‌ర్డ్ పార్టీ కాక‌పోవ‌డంతో.. ఆయ‌న గుర్తు కోసం కొంత స‌స్పెన్స్ లో ప‌డ్డారు. చివ‌ర‌కు గాజు గ్లాసు గు్ర్తు ద‌క్కింది. ఇక‌, నామినేష‌న్ల ప‌రిశీల‌న కూడా పూర్త‌యింది.

మొత్తం 35 మంది అభ్య‌ర్థులు పిఠాపురం నుంచి బ‌రిలో ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు కీల‌క పార్టీల‌కు చెందిన వారు. ఒక‌రు వైసీపీ నుంచి  వంగా గీత‌, రెండు జ‌న‌సేనాని ప‌వ‌న్‌. మిగిలిన 33 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థు లు. ఇక‌, తాజాగా నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ.. ఎన్నిక‌ల అధికారులు జాబితా ఇచ్చారు. దీనిలో డ‌మ్మీ ఈవీఎంపై నాలుగో నెంబ‌రు బ్యాలెట్‌ను ప‌వ‌న్‌కు ఖ‌రారు చేశారు.

అంటే.. ఈవీఎంపై నాలుగో నెంబ‌రు బ‌ట‌న్ వ‌ద్ద‌.. జ‌న‌సేన గుర్తు గాజు గ్లాసు ఉంటుంది. దీనికి పైన‌.. కింద ఎవ‌రికి కేటాయిస్తార‌నేది చూడాలి. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ప‌వ‌న్ క‌ల్యా ణ్ కు నాలుగో నెంబ‌రు ఖ‌రారు చేశార‌ని.. పార్టీ అభిమానులు.. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ను గెలిపించేం దుకు 4వ నెంబ‌రు బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాల‌ని  పార్టీ అభ్య‌ర్థించింది.

అయితే.. తొలి స్థానంలో `ఏ` అక్ష‌రంతో మొద‌ల‌య్యే అభ్య‌ర్థికి కేటాయించే అవ‌కాశం ఉంది. అలా చూసుకుంటే.. రెండు మూడు స్థానాల్లోనే వైసీపీ అభ్య‌ర్థి గీత కు చాన్స్ ఉంటుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు స్వ‌తంత్రుల‌కు తొలి మూడు స్థానాలు (ఈవీఎంల‌లో) కేటాయించినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 30, 2024 7:29 pm

Share

Recent Posts

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

1 hour ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

1 hour ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

3 hours ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

4 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

4 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

5 hours ago