జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నామినేషన్ ఆమోదం పొందడం.. గుర్తును కూ డా కేటాయించిన విషయం విదితమే. రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో.. ఆయన గుర్తు కోసం కొంత సస్పెన్స్ లో పడ్డారు. చివరకు గాజు గ్లాసు గు్ర్తు దక్కింది. ఇక, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది.
మొత్తం 35 మంది అభ్యర్థులు పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కీలక పార్టీలకు చెందిన వారు. ఒకరు వైసీపీ నుంచి వంగా గీత, రెండు జనసేనాని పవన్. మిగిలిన 33 మంది స్వతంత్ర అభ్యర్థు లు. ఇక, తాజాగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులను ఖరారు చేస్తూ.. ఎన్నికల అధికారులు జాబితా ఇచ్చారు. దీనిలో డమ్మీ ఈవీఎంపై నాలుగో నెంబరు బ్యాలెట్ను పవన్కు ఖరారు చేశారు.
అంటే.. ఈవీఎంపై నాలుగో నెంబరు బటన్ వద్ద.. జనసేన గుర్తు గాజు గ్లాసు ఉంటుంది. దీనికి పైన.. కింద ఎవరికి కేటాయిస్తారనేది చూడాలి. ఇదే విషయాన్ని జనసేన తన ట్విట్టర్లో పోస్టు చేసింది. పవన్ కల్యా ణ్ కు నాలుగో నెంబరు ఖరారు చేశారని.. పార్టీ అభిమానులు.. కార్యకర్తలు, ప్రజలు పవన్ను గెలిపించేం దుకు 4వ నెంబరు బటన్ను ప్రెస్ చేయాలని పార్టీ అభ్యర్థించింది.
అయితే.. తొలి స్థానంలో `ఏ` అక్షరంతో మొదలయ్యే అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే.. రెండు మూడు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థి గీత కు చాన్స్ ఉంటుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు స్వతంత్రులకు తొలి మూడు స్థానాలు (ఈవీఎంలలో) కేటాయించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 30, 2024 7:29 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…