జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నామినేషన్ ఆమోదం పొందడం.. గుర్తును కూ డా కేటాయించిన విషయం విదితమే. రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో.. ఆయన గుర్తు కోసం కొంత సస్పెన్స్ లో పడ్డారు. చివరకు గాజు గ్లాసు గు్ర్తు దక్కింది. ఇక, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది.
మొత్తం 35 మంది అభ్యర్థులు పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కీలక పార్టీలకు చెందిన వారు. ఒకరు వైసీపీ నుంచి వంగా గీత, రెండు జనసేనాని పవన్. మిగిలిన 33 మంది స్వతంత్ర అభ్యర్థు లు. ఇక, తాజాగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులను ఖరారు చేస్తూ.. ఎన్నికల అధికారులు జాబితా ఇచ్చారు. దీనిలో డమ్మీ ఈవీఎంపై నాలుగో నెంబరు బ్యాలెట్ను పవన్కు ఖరారు చేశారు.
అంటే.. ఈవీఎంపై నాలుగో నెంబరు బటన్ వద్ద.. జనసేన గుర్తు గాజు గ్లాసు ఉంటుంది. దీనికి పైన.. కింద ఎవరికి కేటాయిస్తారనేది చూడాలి. ఇదే విషయాన్ని జనసేన తన ట్విట్టర్లో పోస్టు చేసింది. పవన్ కల్యా ణ్ కు నాలుగో నెంబరు ఖరారు చేశారని.. పార్టీ అభిమానులు.. కార్యకర్తలు, ప్రజలు పవన్ను గెలిపించేం దుకు 4వ నెంబరు బటన్ను ప్రెస్ చేయాలని పార్టీ అభ్యర్థించింది.
అయితే.. తొలి స్థానంలో `ఏ` అక్షరంతో మొదలయ్యే అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే.. రెండు మూడు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థి గీత కు చాన్స్ ఉంటుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు స్వతంత్రులకు తొలి మూడు స్థానాలు (ఈవీఎంలలో) కేటాయించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 30, 2024 7:29 pm
అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…
బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్…
ఇవాళ రిలీజైన కొత్త సినిమాల్లో అందరి దృష్టి తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ మీద ఉంది కానీ బ్యాడ్ బాయ్…
ఐపీఎల్ 2026లో చాలా మంది ప్లేయర్స్ సరిగ్గా ఆడటం లేదు, కానీ అందరి కళ్లు మాత్రం పంత్, రుతురాజ్, సూర్య…
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…
గురువారం టాలీవుడ్లో రెండు కొత్త పాటలు లాంచ్ అయ్యాయి. అందులో ఒకటి నిఖిల్ మూవీ ‘స్వయంభు’ నుంచి ‘రా రా…