జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నామినేషన్ ఆమోదం పొందడం.. గుర్తును కూ డా కేటాయించిన విషయం విదితమే. రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో.. ఆయన గుర్తు కోసం కొంత సస్పెన్స్ లో పడ్డారు. చివరకు గాజు గ్లాసు గు్ర్తు దక్కింది. ఇక, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది.
మొత్తం 35 మంది అభ్యర్థులు పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కీలక పార్టీలకు చెందిన వారు. ఒకరు వైసీపీ నుంచి వంగా గీత, రెండు జనసేనాని పవన్. మిగిలిన 33 మంది స్వతంత్ర అభ్యర్థు లు. ఇక, తాజాగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులను ఖరారు చేస్తూ.. ఎన్నికల అధికారులు జాబితా ఇచ్చారు. దీనిలో డమ్మీ ఈవీఎంపై నాలుగో నెంబరు బ్యాలెట్ను పవన్కు ఖరారు చేశారు.
అంటే.. ఈవీఎంపై నాలుగో నెంబరు బటన్ వద్ద.. జనసేన గుర్తు గాజు గ్లాసు ఉంటుంది. దీనికి పైన.. కింద ఎవరికి కేటాయిస్తారనేది చూడాలి. ఇదే విషయాన్ని జనసేన తన ట్విట్టర్లో పోస్టు చేసింది. పవన్ కల్యా ణ్ కు నాలుగో నెంబరు ఖరారు చేశారని.. పార్టీ అభిమానులు.. కార్యకర్తలు, ప్రజలు పవన్ను గెలిపించేం దుకు 4వ నెంబరు బటన్ను ప్రెస్ చేయాలని పార్టీ అభ్యర్థించింది.
అయితే.. తొలి స్థానంలో `ఏ` అక్షరంతో మొదలయ్యే అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే.. రెండు మూడు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థి గీత కు చాన్స్ ఉంటుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు స్వతంత్రులకు తొలి మూడు స్థానాలు (ఈవీఎంలలో) కేటాయించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 30, 2024 7:29 pm
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…