Political News

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్యాలెట్ నెంబ‌ర్ ఖ‌రారు.. ఈజీగా ఓటేయొచ్చు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయన నామినేష‌న్ ఆమోదం పొంద‌డం.. గుర్తును కూ డా కేటాయించిన విష‌యం విదితమే. రిజిస్ట‌ర్డ్ పార్టీ కాక‌పోవ‌డంతో.. ఆయ‌న గుర్తు కోసం కొంత స‌స్పెన్స్ లో ప‌డ్డారు. చివ‌ర‌కు గాజు గ్లాసు గు్ర్తు ద‌క్కింది. ఇక‌, నామినేష‌న్ల ప‌రిశీల‌న కూడా పూర్త‌యింది.

మొత్తం 35 మంది అభ్య‌ర్థులు పిఠాపురం నుంచి బ‌రిలో ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు కీల‌క పార్టీల‌కు చెందిన వారు. ఒక‌రు వైసీపీ నుంచి  వంగా గీత‌, రెండు జ‌న‌సేనాని ప‌వ‌న్‌. మిగిలిన 33 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థు లు. ఇక‌, తాజాగా నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ.. ఎన్నిక‌ల అధికారులు జాబితా ఇచ్చారు. దీనిలో డ‌మ్మీ ఈవీఎంపై నాలుగో నెంబ‌రు బ్యాలెట్‌ను ప‌వ‌న్‌కు ఖ‌రారు చేశారు.

అంటే.. ఈవీఎంపై నాలుగో నెంబ‌రు బ‌ట‌న్ వ‌ద్ద‌.. జ‌న‌సేన గుర్తు గాజు గ్లాసు ఉంటుంది. దీనికి పైన‌.. కింద ఎవ‌రికి కేటాయిస్తార‌నేది చూడాలి. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ప‌వ‌న్ క‌ల్యా ణ్ కు నాలుగో నెంబ‌రు ఖ‌రారు చేశార‌ని.. పార్టీ అభిమానులు.. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ను గెలిపించేం దుకు 4వ నెంబ‌రు బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాల‌ని  పార్టీ అభ్య‌ర్థించింది.

అయితే.. తొలి స్థానంలో `ఏ` అక్ష‌రంతో మొద‌ల‌య్యే అభ్య‌ర్థికి కేటాయించే అవ‌కాశం ఉంది. అలా చూసుకుంటే.. రెండు మూడు స్థానాల్లోనే వైసీపీ అభ్య‌ర్థి గీత కు చాన్స్ ఉంటుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు స్వ‌తంత్రుల‌కు తొలి మూడు స్థానాలు (ఈవీఎంల‌లో) కేటాయించినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 30, 2024 7:29 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

13 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

15 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

16 hours ago

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…

16 hours ago

జాన్వీకి చుక్కలు చూపించిన క్రికెట్

ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…

17 hours ago

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

19 hours ago