Political News

స్వర్ణాంధ్ర కోసమే ఈ మేనిఫెస్టో: పవన్

టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సంయుక్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువగళం, జనగళంలో వచ్చిన వినతులు, బీజేపే సలహాలు, సూచనలు క్రోఢీకరించి ఈ మేనిఫెస్టోను విడుదల చేశామని పవన్ అన్నారు. 3 పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, బీజేపీ సూచనలు కలగలిపి ఈ మేనిఫెస్టో తయారు చేశామని అన్నారు.

కత్తి మన మీద ఏపీ భవిష్యత్తు వేలాడుతోందని, ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకమే ఉందని అన్నారు. 10 రూపాయలు ఇచ్చిన వైసీపీ 1000 కొల్లగొడుతోందని ఆరోపించారు. అన్నా క్యాంటీన్లతో పాటు టీడీపీ తెచ్చిన 100  సంక్షేమ పథకాలు రద్దు చేశారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారని మండిపడ్డారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి…ఏపీని చూసి ఆవేదన వ్యక్తం చేస్తోందని చెప్పారు. 13 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థ పతనం చేసిన జగన్ ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల అప్పు భారం మోపారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగం 24 శాతం ఉందని అన్నారు. సంపద సృష్టించే ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలను నాశనం చేశారని, ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు 600 మందిని హత్య చేశారని ఆరోపించారు. వివేకా హంతకులను కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు.
విధ్వంస పాలన సాగనంపాలని, స్వర్ణాంధ్రను నిర్మించేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు.

This post was last modified on April 30, 2024 7:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జాక్ మిస్సవుతున్న కిక్స్ ఇవే

టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…

6 minutes ago

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం…

16 minutes ago

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…

22 minutes ago

“ఆమె నటిస్తేనే సినిమా… లేదంటే లేదు”

కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…

45 minutes ago

ట్రంప్ చర్యలకు బాబు బాధ్యుడా జగన్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…

1 hour ago

ఇది నిజం!… పవన్ విద్యార్థులకు అడ్డమే రాలేదు!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…

2 hours ago