Political News

పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా

ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాత‌త‌రానికి చెందిన నాయ‌కులు.. ఒక కులాన్ని ప్ర‌భావితం చేస్తార‌ని భావించే నాయ‌కులు ముఖ్యంగా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చిన‌.. ఇబ్బంది త‌ప్ప‌దు. తాజాగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్‌ను ఓడించ‌క‌పోతే.. పేరు మార్చుకుంటాన‌ని అనేశారు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న ఒక లాజిక్‌లేని వ్యాఖ్య కూడా చేశారు. ప‌వ‌న్‌ను ఏ అర్హ‌త ఉంద‌ని పిఠాపురంలో పోటీ చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

ఎక్క‌డో హైద‌రాబాద్‌లో ఉండే… ప‌వ‌న్ వ‌చ్చేస్తే.. ఇక్క‌డ గెలిపించాలా? ఇక్క‌డ ఆయ‌న‌కు ఓట్లేయాలా? అని ముద్రగ‌డ త‌న అక్క‌సు వెళ్ల గ‌క్కారు. కానీ, ఈ దేశంలో ఎక్క‌డి వారు ఎక్క‌డైనా పోటీ చేయొచ్చ‌న్న విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఎక్క‌డో ఢిల్లీలో ఉన్న ఇందిర‌మ్మ‌.. 1978 ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన విష‌యం ఆయ‌న మ‌రిచిపోయి అయినా.. అయి ఉండాలి.. లేక‌పోతే.. న‌టిస్తున్నార‌ని అనుకోవాలి.

పోనీ.. ఆ సంగ‌తి వ‌దిలేస్తే.. ఎక్క‌డో గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ధాని మోడీ.. యూపీలో వార‌ణాసి నుంచి వ‌రుస‌గా పోటీ చేస్తూనే ఉన్నారు. రెండు సార్లు విజ‌యం కూడా అందుకున్నారు. పోనీ.. ఈయ‌న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కాంగ్రెస్‌కు చెందిన అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ వార‌స‌త్వంగా వచ్చిన అమేధీ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. ఎక్క‌డో కేర‌ళ‌లో ఉన్న వ‌యనాడ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రి వీరంతా స్థానికులా?  అనేది ముద్ర‌గ‌డ చెప్పాలి.

ఇక‌, వైసీపీకే వ‌చ్చినా.. ఎక్క‌డో హైద‌రాబాద్‌లో ఉంటున్న సింహాద్రి చంద్ర‌శేఖ‌ర్‌ను వ‌ద్ద‌ని అంటున్నా.. తీసుకువ‌చ్చి.. మ‌చిలీప‌ట్నం ఎంపీ టికెట్ ఇచ్చారు. దీనికి ముద్ర‌గ‌డ ఏం చెబుతారు?  అంతేకాదు.. అస‌లు మ‌న రాష్ట్రంతోనే సంబంధం లేని.. క‌ర్ణాట‌క‌కు చెందిన గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి బందువు.. జోల‌ద‌రాశి శాంత‌ను తీసుకువ‌చ్చి.. హిందూపురం ఎంపీగా వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదా?  దీనికి ముద్ర‌గ‌డ స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?  వారికి ఎందుకు ఓటేయాల‌ని టీడీపీ అంటే.. స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌రా?  

సో.. దేశ చ‌రిత్ర‌లో నాయ‌కులు ఎక్క‌డ నుంచి ఎక్క‌డైనా పోటీ చేయొచ్చ‌ని రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 84 స్ప‌ష్టంగా చెబుతోంది. ఇలాంట‌ప్పుడు.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు పెట్టుకుని.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా.. ఉన్న ప‌రువును మ‌రింత దిగ‌జార్చుకోవ‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 30, 2024 5:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

20 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

3 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

5 hours ago