కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు ఆ టికెట్ దక్కకపోయినా ఊరట మాత్రం లభించింది. కరీంనగర్ టికెట్ను ఇవ్వని కాంగ్రెస్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేసే అవకాశాన్ని తీన్మార్ మల్లన్నకు కల్పించింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు.
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్రవీణ్రెడ్డి, వెలిచాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న తదితరులు పోటీపడ్డారు. తీన్మార్ మల్లన్న ఈ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పరిగణించలేకపోయింది. చివరకు ఈ టికెట్ వెలిచాల రాజేందర్రావుకు దక్కింది. దీంతో నిరాశలో మునిగిపోయిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ గుడ్న్యూస్ చెప్పింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను బరిలో దింపుతున్నట్లు ప్రకటించింది.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నిజానికి 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోదండరాంను దాటేసి మల్లన్న రెండో స్థానంలో నిలవడంతో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్గా మారారు. మరి ఈ సారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న మల్లన్న విజయం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే మరో మూడేళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉండే అవకాశముంది.
This post was last modified on April 26, 2024 6:37 am
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…