Political News

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్

క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌ని భావించిన తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌కు ఆ టికెట్ ద‌క్క‌క‌పోయినా ఊర‌ట మాత్రం ల‌భించింది. క‌రీంన‌గ‌ర్ టికెట్‌ను ఇవ్వ‌ని కాంగ్రెస్‌.. ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మాత్రం పోటీ చేసే అవ‌కాశాన్ని తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌ల్పించింది. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌రిలో దిగ‌నున్నారు.

క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్ర‌వీణ్‌రెడ్డి, వెలిచాల రాజేంద‌ర్‌రావు, తీన్మార్ మ‌ల్ల‌న్న త‌దిత‌రులు పోటీప‌డ్డారు. తీన్మార్ మ‌ల్ల‌న్న ఈ సీటు కోసం తీవ్రంగానే ప్ర‌య‌త్నించారు. కానీ ఆయ‌న్ని ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ ప‌రిగ‌ణించ‌లేక‌పోయింది. చివ‌ర‌కు ఈ టికెట్ వెలిచాల‌ రాజేంద‌ర్‌రావుకు ద‌క్కింది. దీంతో నిరాశ‌లో మునిగిపోయిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కాంగ్రెస్ గుడ్‌న్యూస్ చెప్పింది. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను బ‌రిలో దింపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా ఉన్న ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 4.61 ల‌క్ష‌ల మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. నిజానికి 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ల్ల‌న్న ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో కోదండ‌రాంను దాటేసి మ‌ల్ల‌న్న రెండో స్థానంలో నిల‌వ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న హాట్ టాపిక్‌గా మారారు. మ‌రి ఈ సారి కాంగ్రెస్ నుంచి బ‌రిలో దిగుతున్న మ‌ల్ల‌న్న విజ‌యం ఖాయ‌మ‌నే అభిప్రాయాలున్నాయి. ఈ ఉప ఎన్నిక‌లో గెలిస్తే మ‌రో మూడేళ్ల పాటు ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌విలో ఉండే అవ‌కాశ‌ముంది.

This post was last modified on April 26, 2024 6:37 am

Share

Recent Posts

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

24 minutes ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

28 minutes ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

2 hours ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

3 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

4 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

4 hours ago