కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు ఆ టికెట్ దక్కకపోయినా ఊరట మాత్రం లభించింది. కరీంనగర్ టికెట్ను ఇవ్వని కాంగ్రెస్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేసే అవకాశాన్ని తీన్మార్ మల్లన్నకు కల్పించింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు.
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్రవీణ్రెడ్డి, వెలిచాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న తదితరులు పోటీపడ్డారు. తీన్మార్ మల్లన్న ఈ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పరిగణించలేకపోయింది. చివరకు ఈ టికెట్ వెలిచాల రాజేందర్రావుకు దక్కింది. దీంతో నిరాశలో మునిగిపోయిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ గుడ్న్యూస్ చెప్పింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను బరిలో దింపుతున్నట్లు ప్రకటించింది.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నిజానికి 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోదండరాంను దాటేసి మల్లన్న రెండో స్థానంలో నిలవడంతో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్గా మారారు. మరి ఈ సారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న మల్లన్న విజయం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే మరో మూడేళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉండే అవకాశముంది.
This post was last modified on April 26, 2024 6:37 am
మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ…
https://www.youtube.com/watch?v=kR4Y4m3FyhU&t=225s హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా…
ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందాని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు…
బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా…
400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో…