కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు ఆ టికెట్ దక్కకపోయినా ఊరట మాత్రం లభించింది. కరీంనగర్ టికెట్ను ఇవ్వని కాంగ్రెస్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేసే అవకాశాన్ని తీన్మార్ మల్లన్నకు కల్పించింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు.
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్రవీణ్రెడ్డి, వెలిచాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న తదితరులు పోటీపడ్డారు. తీన్మార్ మల్లన్న ఈ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పరిగణించలేకపోయింది. చివరకు ఈ టికెట్ వెలిచాల రాజేందర్రావుకు దక్కింది. దీంతో నిరాశలో మునిగిపోయిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ గుడ్న్యూస్ చెప్పింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను బరిలో దింపుతున్నట్లు ప్రకటించింది.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నిజానికి 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోదండరాంను దాటేసి మల్లన్న రెండో స్థానంలో నిలవడంతో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్గా మారారు. మరి ఈ సారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న మల్లన్న విజయం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే మరో మూడేళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉండే అవకాశముంది.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…